బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెరుకుతో 30 అడుగుల శ్రీ వినాయకుడు, 4 వేల కేజీల లడ్డు, గణపయ్యకు ప్రత్యేక పూజలు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వినాయక చవితి సందర్బంగా బెంగళూరు నగరంలోని జేపీ నగరలోని పుట్టేనహళ్ళిలో శ్రీసత్య సాయి గణపతి ఆలయంలో 50 టన్నుల చెరుకుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. చెరుకుతో తయారు చేసిన వినాకుడికి పరిసర స్నేహి అని నామకరణం చేసి 4 వేల కేజీల లడ్డు నైవేధ్యంగా పెట్టి భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.

ఇరాన్, ఇరాక్ లో మా మామ ఏమైనా ఉన్నాడా, పెట్రోల్ ఫ్రీగా ఇవ్వాలా ? బీజేపీ ఎమ్మెల్యే!ఇరాన్, ఇరాక్ లో మా మామ ఏమైనా ఉన్నాడా, పెట్రోల్ ఫ్రీగా ఇవ్వాలా ? బీజేపీ ఎమ్మెల్యే!

శ్రీ సత్య సాయి గణపతి దేవాలయంలో చెరుకుతో తయారు చేసి వినాయకుడి విగ్రహం ముందు 4 వేల కేజీలతో ప్రత్యేకంగా లడ్డు తయారు చేసి పెట్టారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వైవిద్యంగా నిర్వహించడం శ్రీ సత్య సాయి వినాయక ఆలయ కమిటీ నిర్వహకుల అనవాయితి.

50 టన్నుల చెరుకు

50 టన్నుల చెరుకు

వినాయక చవితి సందర్బంగా శ్రీ సత్య సాయి వినాయకుడి ఆలయం దగ్గర 50 టన్నుల చెరుకుతో 30 అడుగుల ఎత్తు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పరిసరాలకు ఎలాంటి హాని కలగకూడదని చెరుకుతో వినాయకుడి విగ్రహం తయారు చేశారు. 50 మంది నిపుణులు కొన్ని రోజులు పగలు రాత్రి శ్రమించి చెరుకుతో వినాయకుడి విగ్రహాన్ని వైవిధ్యంగా, అందంగా తయారు చేశారని ఆలయం కమిటీ నిర్వహకులు తెలిపారు.

4 వేల కేజీల లడ్డు

4 వేల కేజీల లడ్డు

వినాయక చవితి సందర్బంగా శ్రీ సత్య సాయి వినాయకుడి ఆలయంలో వినాయకుడి చెరుకు విగ్రహం ముందు 4 వేల కేజీలతో లడ్డు తయారు చేశారు. వెయ్యి కేజీల వేరుశెనగ పప్పుల పొడి, 2 వేల కేజీల చక్కెర, 700 కేజీల సన్ ఫ్లవర్ నూనె, 300 కేజీల నెయ్యి, 50 కేజీల జీడిపప్పు, 50 కేజీల ఎండు ద్రాక్ష, 5 కేజీల సుగంధ ద్రవ్యాలతో 4 వేల కేజీల లడ్డు తమారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టామని ఆలయం కమిటీ సభ్యులు తెలిపారు.

ఖైరతాబాద్ స్పూర్తి

ఖైరతాబాద్ స్పూర్తి

హైదరాబాద్, ముంబై తదితర చోట్ల వినాయక చవితి సందర్బంగా భారీ లడ్డులు తయారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టడం ఆనవాయితి. గత ఏడాది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో వినాయక చవితి సందర్బంగా 4 వేల కేజీల లడ్డు తయారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టారు. ఖైరతాబాద్ లడ్డును స్పూర్తిగా తీసుకుని బెంగళూరులో మొదటి సారి 4 వేల కేజీల లడ్డు తయారు చేసి వినాయకుడికి నైవేధ్యంగా పెట్టామని ఆలయం కమిటీ నిర్వహకులు అంటున్నారు.

భక్తుల ప్రత్యేక పూజలు

భక్తుల ప్రత్యేక పూజలు

జేపీ నగర్ లోని పుట్టేనహళ్ళిలోని శ్రీ సత్య సాయి వినాయకుడి ఆలయంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల చెరుకు వినాయకుడిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నిలువెత్తు వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

బెంగళూరులో ఫస్ట్

బెంగళూరులో ఫస్ట్

బెంగళూరు నగరంలో వినాయక చవితి సందర్బంగా మొదటి సారి 4 వేల కేజీలతో భారీ లడ్డు తయారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టారు. బెంగళూరు నగరంలో ఇంత భారీ లడ్డును తయారు చెయ్యడం ఇదే మొదటి సారి అని స్వామి వారి భక్తులు అంటున్నారు. మొత్తం మీద 30 అడుగుల ఎత్తులో చెరుకుతో తయారు చేసిన వినాయకుడి విగ్రహం, 4 వేల కేజీల వినాయకుడి విగ్రహం భక్తులను ఆకర్షిస్తున్నది.

English summary
A grand 4,000 kg 'maha laddoo' prepared and displayed at JP Nagar, Bengaluru here ahead of the commencement of the Ganesha festival. Ganesha also made of sugar cane is attracting the visitors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X