ప్రియురాలితో పాటు కారు డ్రైవర్ను చంపిన ప్రియుడు..!
మహిళలపై హత్యాలు, అత్యాచారాలపై ఓ వైపు అందోళనలు కొనసాగుతుంటే... మరోవైపు మహిళలపై అత్యాచారాలకు మాత్రం ఫుల్స్టాప్ పడడం లేదు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యణాలో ఓ అంతర్జాతీయ స్థాయి బాడీబిల్డర్, ఫిట్నెస్ నిపుణుడు తన ప్రియురాలిని దారుణంగా కాల్చి చంపాడు. అనంతరం ఆమె శవాన్ని సైతం కనిపించకుండా చేశాడు. ప్రియురాలి శవాన్ని మాయం చేసే సమయంలో నిందితుడు పోలీసులకు పట్టుపడ్డాడు.
హర్యానాలోని రేవారి జిల్లాలో శనివారంనాడు ఈ సంఘటన జరగగా వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. హర్యాణకు చెందిన హెమంత్ లాంబా రాజస్థాన్కు చెందిన రోహిణి గతకొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. కాగా రోహిణి ఢిల్లీలో తన బంధువులో ఇంట్లో ఉండగా హెమంత్ ఓ జిమ్ను నడుపుతూ... ఫిట్నెస్ ట్రైయినర్గా కొనసాగుతున్నాడు. అయితే ఇద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ప్రియురాలిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఆమె శవాన్ని గుర్తు తెలియని ప్రాంతంలో పడేసి వచ్చాడు.
ఇక అక్కడ నుండి ఓ క్యాబ్ మాట్లాడుకుని బయలుదేరాడు. దారి మధ్యలోనే తనను జైపూర్కు తీసుకెళ్లాలని క్యాబ్ డ్రైవర్ను అడిగాడు. అయితే అందుకు క్యాబ్ డ్రైవర్ నిరాకరించడంతో కారు డ్రైవర్ను కూడ కాల్చి చంపాడు. అనంతరం ఆ బాడిని పడేసీ తాపిగా గుజరాత్ బయలుదేరి వెళ్లాడు. అనంతరం కారును అమ్మెందుకు సిద్దమయ్యాడు. కారును అమ్మెందుకు డిలర్ వద్దకు వెళ్లిన నేపథ్యంలనే హెమంత్ వాలకం చూసిన డీలర్కు అనుమానం వచ్చింది. దీంతో అప్రమత్తమైన డీలర్ కారులో విండ్ స్క్రీన్పై కనిపించే ఫోన్ నంబర్కు కాల్ చేశాడు. దీంతో ఆఫోన్ కారు డ్రైవర్ భార్య లిఫ్ట్ చేసి మాట్లాడింది. దీంతో విషయం తెలుసుకున్న డీలర్ అల్పేష్ గుజరాత్ లోని స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. నిందితున్ని అరెస్ట్ చేసి కూపీ లాగడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి.