ఏనుగుల బీభత్సం.. ఊరిమీద పడి.. వరి పొలాలు ధ్వంసం (వీడియో)
అసోం : అటవీప్రాంతాల్లో గజరాజుల బీభత్సం అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భాల్లో సమీప గ్రామాలపై విరుచుకుపడే ఘటనలు కూడా కనిపిస్తుంటాయి. తాజాగా అసోంలో ఏనుగుల కారణంగా పంట చేలో పడి విధ్వంసం సృష్టించాయి. వాటికి కోపం వచ్చిన సందర్భాల్లో మనుషులపై కూడా దాడి చేస్తాయి.
అసోంలో గజరాజులు సృష్టించిన వీరంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హోజాయ్ జిల్లాలో ఓ గ్రామంలోకి చొరబడిన ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. వరిపొలాల్లోకి చొరబడి పంటను ధ్వంసం చేశాయి.
చొక్కాపై చొక్కా.. 15 షర్ట్స్ ధరించాడు.. ఎందుకో తెలిస్తే షాకే..! (వీడియో)
#WATCH: A herd of elephants entered a village of Hojai district and destroyed paddy crops and allegedly trampled a 75-year-old man, yesterday. The man died today. #Assam pic.twitter.com/RfghuCqYes
— ANI (@ANI) July 9, 2019
అయితే కళ్లముందే గజరాజులు పొలాల్లోకి వచ్చి పంటను నాశనం చేస్తుంటే అక్కడే ఉన్న ఓ 75 ఏళ్లు వృద్ధుడు వాటిని తరిమేందుకు యత్నించాడు. ఆ క్రమంలో గజరాజులు అతడిపై దాడి చేశాయి. దాంతో తీవ్రగాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదలావుంటే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ఏనుగుల గుంపును నెమ్మదిగా గ్రామంలో నుంచి అడవిలోకి పంపించేశారు.