కశ్మీర్ పై రేపే కీలక నిర్ణయం..!? అమిత్ షా అత్యవసర సమావేశం..!!
జమ్ము కశ్మీర్లో నెలకొన్న తాజా పరిణామాలపై హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కొనసాగుతోంది...పార్లమంట్ ఆవరణలో నిర్వహిస్తున్న సమావేశానికి జాతీయ భద్రతా దళాల సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ సెక్రటరీ రాజీవ్ గూబలతోపాటు పలువురు ఉన్నత అధికారులు కశ్మీర్ లోయలో నెలకొన్న తాజ పరిస్థితిపై చర్చిస్తున్నారు.
గత రెండు మూడు రోజులుగా కశ్మీర్లో టెన్షన్ వాతవరణ నెలకోన్న విషయం తెలిసిందే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే, ఓవైపు బారీగా భద్రతా దళాల మోహరింపు, మరోవైపు పాకిస్థాన్ ఉగ్రవాదులు అమర్ నాథ్ యాత్రపై నజర్ వేశారు. దీంతొ అనుక్షణం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ ప్రభుత్వం అమర్నాథ్ యాత్రికులతోపాటు, టూరిస్టులు కశ్మీర్ వదిలి వెంటనే తమ స్వస్థలాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికితోడు ఎల్వోసి వెంట పాకిస్థాన్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో పరిస్థితి విషమించింది.
మరోవైపు కశ్మీర్ లోయలో వస్తున్న పుకార్లపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ విరుద్ద ప్రకటనలు చేస్తున్నాడు. ఆర్టికల్స్ తోలగింపు పై వస్తున్న వార్తలను ఆయన కోట్టిపారయేడంతో ఎలాంటీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కాని అందుకు విరుద్దంగా పరిస్థితి ఉండడంతో లోయలో పరిస్థితి ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే...