ఉద్యోగం ఆశ చూపి ఆసుపత్రిలో ఆమెపై అత్యాచారం చేశాడు
కొడుకుకు వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళపై ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ అత్యాచారం చేశాడు. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
బీహర్ :కుమారుడికి జ్వరం వచ్చిందని ఓ మహిళ ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమెపై ఆసుపత్రిలో పనిచేసే అటెండర్ అత్యాచారం చేశాడు. ఆమెకు ఉద్యొగం ఇప్పిస్తానని కూడ ఆశచూపాడు. బాధితురాలి పిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
బీహర్ రాష్ట్రంలోని దర్భంగా పట్టణంలోని వైద్య కళశాలలో బిపిని అనే వ్యక్తి అటెండర్ గా పనిచేస్తున్నాడు. సమస్తిపూర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తన కుమారుడి చికిత్స కోసం దర్భంగా వైద్య కశాశాలకు వచ్చింది.
కుమారుడికి చికిత్స కోసం జరిపించేందుకుగాను ఆమె ఆసుపత్రి వర్గాలను సంప్రదించింది.అయితే ఈ ఆసుపత్రిలో అటెండర్ గా పనిచేస్తోన్న బిపిన్ ఆమెపై కన్నేశాడు. బాబుకు చికిత్స చేయించడంతో పాటు ఆమెకు పనిమనిషిగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మలికాడు.
ఆ మహిళపై అత్యాచారం చేశాడు. బాదితురాలు అలారం మోగించడంతో సెక్యూరిటీ గార్డులు వచ్చి అటెండర్ బిపిన్ ను పట్టుకొన్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.