భార్య లేదని, కూతురిపై అత్యాచారం చేశాడు,బాలిక ఏం చేసిందంటే?
వావివరుసలు మరిచిపోయి ఓ తండ్రి తన కూతురిపై ఆరుమాసాలుగా అత్యాచారం చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై :వావి వరసులు మరిచాడు, మద్యం మత్తులో కూతురిపై ఆరు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుమల్లూరు జిల్లాలోని ఉతుకొట్టాయి పట్టణానికి సమీపంలోని 43 ఏళ్ళ వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. రోజుకూలీగా పనిచేస్తూ ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఆయన భార్యకు మతిస్థిమితం లేదు.
దీంతో ఆయన తన భార్యను బంధువుల ఇంట్లో ఉంచాడు. తన వద్ద 14 ఏళ్ళ పెద్ద కూతురును ఉంచుకొన్నాడు. ప్రతి రోజూ పీకల దాకా మద్యం తాగి వచ్చేవాడు. కూతురిపైనే అత్యాచారం చేసేవాడు. ఆరుమాసాలుగా బాలికపై అత్యాచారం చేస్తుండడంతో ఆ బాలిక గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని గమనించిన బాలిక అత్త బాలికను వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భవతి అని తేలింద.ఓ స్వచ్చంధ సంస్థ వలంటీర్ సహయంతో పోలీసులకు బాలిక అత్త పిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.