ఓటు వేరే పార్టీకి పడిందని వేలు కోసుకున్న యువకుడు
రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ,అభిమానులే బలం , కార్యకర్తలు, అభిమానులు లేకుండా పార్టీ మనుగడ సాధించడం కష్టం . కొందరైతే పార్టీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్లు కూడ ఉంటారు , పార్టీ కొసం ఎంతకైనా తెగించే వాళ్లు సైతం దేశ వ్యాప్తంగా ఉంటారు. ఇలాంటీ నేపథ్యంలోనే యూపిలోని ఓ పార్టీ అభిమాని తాను అనుకున్న తన అభిమానాన్ని చాటుకున్నారు. 18 వతేదిన జరిగిన ఎన్నికల్లో బీఎస్పీకి ఓటు వేయబోతే బీజేపీ కి పడిందని తన వేలును తానే కోసుకున్నాడు.
ఉత్తర ప్రదేశ్ లోని బులంద్శవర్ కు చెందిన పవన్ కుమార్ అనే ఓ పార్టీ అభిమాని ఏప్రిల్ 18న జరిగిన ఎన్నికల్లో ఓటును వేశాడు. అయితే అంతా బాగానే ఉన్నా ఆయన ఓటు వేసే సమయంలో తికమక పడ్డాడు. ఈవీఎంలలోని గుర్తులను చూసి తికమకపడిన పవన్ కుమార్ బీజేపీ గుర్తు అయిన కమలం పై ప్రెస్ చేశాడు. దీంతో ఓటు తన ఓటు బీజేపి కి పడింది. దీంతో తాను కోరుకున్న పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓటేశానన్న బాధతో తన వేలిని కోసుకున్నాడు.
కాగా ఇదే విషయాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. కాగా ఆ వీడియో లో వేలు ఎందుకు కట్ చేసుకున్నావ్ అని అడిగితే నేను బీఎస్పి పార్టీ ఎనుగు గుర్తుకు ఓటు వేయబోతే అది పోరపాటున కమలం గుర్తుపై నొక్కాను అని చెప్పారు.అందుకే వేలు కోసుకున్నాను అని ఉంది.