లక్షల ఉద్యోగం వదులుకుని రైల్వేలో ట్రాక్మెన్గా చేరిన యువకుడు...
ప్రైవేట్ కంపనీల్లో ఉద్యోగాలు రావడమే చాల అరుదు, ప్రవేట్ ఉద్యోగాల్లో లక్షల రుపాయల జీతాలు ఉంటాయి, కాని ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో , ఊడుతుందో తెలియని టెన్షన్, నిరంతర శ్రమ, ఊపిరి సలపనీయని పని ఒత్తిడి, దీనికి తోడు మానసిక ప్రశాంతత ఉండకపోవడం ప్రవేటుకు చెందిన ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న టెన్షన్, అందుకే చాలమంది సాఫ్ట్వేర్ రంగంలోకి వెల్లిన ఉన్నత విద్యావంతులు తిరిగి ప్రభుత్వ కొలువుల్లోకి చేరిన సంఘటనలు ఇప్పడిప్పుడే చోటుచేసుకుంటున్నాయి. ప్రవేట్ కంపనీల్లో స్వయంగా టేన్షన్ అనుభవించిన వారు వెనక్కి తిరిగి వస్తున్నారు.
ఇందులో భాగంగానే ఐఐటీ ముంబాయిలో పట్టా ఉన్న ఓ వ్యక్తి లక్షల రూపాయల ఇచ్చే ఉద్యోగాన్ని అందిపుచ్చుకోవచ్చు.. కాని ఓ యువకుడు మాత్రం ఇందుకు బిన్నంగా వ్యవహరించారు. ప్రవైట్ రంగంలో లక్షల రుపాయలు ఇచ్చే ఉద్యోగాలను కాదనుకుని రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగిగా చేరాడు. దీంతో ఆ యువకుడి సర్టిఫికెట్స్ చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఈనేపథ్యంలోనే బీహార్కు చెందిన శ్రావన్ కుమార్ అనే యువకుు ధన్బాద్ రైల్వే డివిజన్లో ట్రాక్మెన్గా ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రైల్వేలో చేరడానికి ఉద్యోగ భద్రతే ప్రధాన కారణమని తెలిపాడు. కాగా పాట్నాకు చెందిన శ్రావన్ కుమార్ 2010లో ఐఐటీ ముంబాయిలో చేరి ఇంటిగ్రేటేడ్ డ్యూయల్ డిగ్రీలో కోర్సులో పట్టా అందుకున్నాడు. ఈనేపథ్యంలోనే ప్రవైటు ఉద్యోగాలకు వెళ్లకుండా చిన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యగం చేయాలనే సంకల్పంతోనే రైల్వేలో చేరానని చెప్పాడు. ప్రస్థుతం ఉన్న డిగ్రీలతో రైల్వేలోనే ఉన్నత స్థాయి అధికారిని అవుతానని దీమా వ్యక్తం చేశాడు.