మహిళ ప్రాణం తీసిన సోషల్ మీడియా పిచ్చి,స్నేహితుడు పాట పాడలేదని, భర్త, పిల్లలు !
బెంగళూరు: సోషల్ మీడియా పచ్చితో యాప్ లో పాట పోస్టు చెయ్యడానికి స్నేహితుడు తనతో కలిసి పాట పాడలేదని ఆవేదనతో మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర పట్టణంలో జరిగింది. కేవలం స్నేహితుడు పాట పాడలేదని, దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యలేదని ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
హనీట్రాప్, దుబాయ్ రిటన్, కాలేజ్ అమ్మాయితో వల, రాసలీలలు టీవీలో చూపిస్తాం !
చిక్కబళ్లాపురంలోని గర్ల్స్ స్కూల్ వెనుక భాగంలో శిల్ప అనే మహిళ నివాసం ఉంటున్నది. శిల్పకు వివాహం అయ్యి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో స్మైల్ అనే యాప్ క్రియేట్ చేసిన శిల్ప పాటలు పాడి అందులో పోస్టు చెయ్యడం అనవాయితిగా పెట్టుకుంది.
శిల్ప సోషల్ మీడియా ఓ పిచ్చిగా మారినంత పని అయ్యింది. నిత్యం సోషల్ మీడియాలో శిల్ప పాడిన పాటలు పెట్టే సరదా కాస్త మితిమీరిపోయింది. సోషల్ మీడియా ద్యాస తప్ప వేరే ద్యాస లేక శిల్ప చాలకాలం నుంచి సతమతం అయ్యింది.
చిక్కబళ్లాపురంలోనే నివాసం ఉంటున్న దేవరాజ్ అనే వ్యక్తి శిల్పతో కలిసి పాటలు పాడటం, ఆ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో పెట్టడం కొంత కాలంగా జరిగింది. శుక్రవారం శిల్ప భర్త పనిమీద ఊరికి వెళ్లాడు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పాట పాడి పోస్టు చెయ్యడానికి వెంటనే రావాలని శిల్ప స్నేహితుడు దేవరాజ్ కు ఫోన్ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్: ఐపీఎస్ అధికారి బదిలి, పోస్టింగ్ మాత్రం లేదు, సంకీర్ణం దెబ్బ !
అయితే దేవరాజ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. పాట పాడటానికి దేవరాజ్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. శుక్రవారం అర్దరాత్రి శిల్ప ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టిన తరువాత దేవరాజ్ కు ఫోన్ చేసింది. అయితే దేవరాజ్ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. ఈ విషయంలో విరక్తి చెందిన శిల్ప ఇంటిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శనివారం ఎంత సేపు ఫోన్ చేసినా శిల్ప నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె భర్త ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. ఇంటి యజమాని కిటికిలో నుంచి చూడగా శిల్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. కేవలం సోషల్ మీడియాలో పాట పాడి పోస్టు చెయ్యనందుకే శిల్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, కేసు విచారణలో ఉందని పోలీలులు తెలిపారు.