సెలవులిచ్చి.. పాఠశాలలోనే ఉపాధ్యాయుల రోమాన్స్!
మీరట్: ఎవరైనా ప్రేమించుకుంటే.. పార్కులకు, సినిమాలకు, వ్యక్తిగతంగా ఎక్కడైనా కలుసుకుని ప్రేమించుకుంటారు. అయితే ఇక్కడ ఓ భగ్న ప్రేమికులు మాత్రం వారు విధులు నిర్వహిస్తున్న పాఠశాలనే ప్రేమ మందిరంగా మార్చుకున్నారు. అంతటితో ఆగకుండా, పాఠశాలలోని విద్యార్థులను సమయానికి ముందే పంపించడం, లేదంటే పాఠశాలకు సెలవు ప్రకటించి మరీ ప్రేమించుకుంటున్నారు.
ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీజ్నోర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపాల్, మరోక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రేమించుకుంటున్నారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు ఏకంగా పాఠశాలనే ప్రేమ మందిరంగా మార్చుకున్నారు.
వారికి ప్రేమించుకోవాలని అనిపించినప్పుడల్లా పాఠశాలకు సెలవిచ్చి ప్రేమించుకుంటున్నారు. అయితే ఓ రోజు ఉదయం 10 గంటలకు ప్రిన్సిపాల్ పాఠశాలకు సెలవు ఇచ్చాడు. అంతలోనే ప్రిన్సిపాల్ ప్రేయసి అక్కడ వాలిపోయింది.
ఇక ఇద్దరు పాఠశాలలోనే ముద్దుల కౌగిలింతలలో మునిగిపోయారు. పాఠశాలకు 10 గంటలకు సెలవు ఇవ్వడమేంటని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. ఇక వీరిద్దరూ ముద్దులతో మునిగితేలుతున్నారు.
గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రేమజంటను అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. కావాలనే కొందరు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తోటి ఉపాధ్యాయురాలిగా అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుందని చెప్పారు. కాగా, వీరిద్దరిని ఉన్నతాధికారులు బుధవారం సస్పెండ్ చేశారు.