గిరిజన యువతితో సంబంధం ఉందని ముస్లిం యువకున్ని కొట్టి చంపిన బంధువులు
ప్రేమ వ్యవహారంలో మరో యువకుడు బలి అయ్యాడు.ప్రేమకు కుల మతాలు అడ్డు రావడంతో యువకున్ని కాపు కాసి కట్టేలతో దాడి చేశారు. అమ్మాయి తరఫున బంధువులు మూకుమ్మడి దాడి చేసి రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. అనంతరం తల్లిదండ్రులకు తెలిసి ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పోందుతూ మృతి చెందాడు.
గుజరాత్లోని భరోచు జిల్లాలోని జగదీయ అనే ప్రాంతంలో ఫియాజ్ అనే 17ఏళ్ల ముస్లిం యుయుకుడికి ఓ గిరిజన యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు.దీంతో ఆమేతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. కాగా ఫియాజ్ వారం రోజుల క్రితం తన మిత్ర బృందంతో కలసి అఖిలేశ్వర్ ప్రాంతానికి వెళ్లాడు. దీంతో కాపు కాసిన యువతి బంధువులు ఫియాజ్ను అడ్డగించి విపరీతంగా కొట్టారు. దీంతో యువకుడి తీవ్ర గాయాల పాలు కావడంతో శరీరంలోని పలు భాగాలు దెబ్బతిన్నాయి.
దీంతో అదే సమయానికి ఫియాజ్ తల్లి ఫోన్ చేయడంతో దాడి జరిగిన విషయం తెలిసింది. దీంతో సంఘటన స్థలానికి వెళ్లిన తల్లికి ఫియాజ్ రక్తపు మడుగులో పడిఉన్న కొడుకును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాలు విపరీతంగా తాకడంతో ఫియాజ్ చికిత్స పోందుతూ మృతి చెందాడు. దీంతో తల్లి దండ్రులు కేసును నమోదు చేయించారు. ఫియాజ్ పై మూకుమ్మడి దాడి జరిగిందని పిర్యాధు చేశారు. దీంతో హిందు, ముస్లింల మధ్య జరిగిన గొడవగా ప్రజలు భావిస్తుండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో గిరిజన యువతితో లైంగిక సంబంధం పెట్టుకోవడం వల్లే దాడి చేశారని పోలీసులు తెలిపారు.