భార్య, కోడలిపై అనుమానం.... పోడిచి చంపిన రిటైర్డ్ టీచర్
ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయాడు. ఆరుపదుల వయస్సున్న భార్యతో పాటు తన స్వంత కోడలిపైన అనుమానాలు ఏర్పరచుకున్నాడు. ఇతరులతో అక్రమ సంబంధం ఉందని అనుమానంతో భార్య మరియు కోడలిపై దారుణంగా దాడి చేసి కత్తితో పోడిచి ఇద్దరిని చంపాడు. మధ్యలో వెళ్లిన కోడుకుపై సైతం దాడి చేయడంతో తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.
మహిళలపై హత్యలు, హత్యాచారాలపై ఓవైపు దేశం మొత్తం గొంతెత్తి నినదిస్తుంటే...మరోవైపు మృగాళ్లు ఇవేమీ పట్టించుకోకుండా దారుణంగా .. దేశ రాజధానిలో మరో సంఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను ,తన కోడలిపై కత్తితో దాడి చేసి చంపారు. వివరాల్లోకి వెళితే... సతీష్ చౌదరీ అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడైన సతీష్ చౌదరీ కుటుంబం ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో నివసిస్తున్నారు. వారితో పాటు భార్యభర్తలతో పాటు వారి పెద్ద కోడలు మరియు చిన్న కుమారుడు సౌరభ్లు కలిసి జీవిస్తున్నారు. కాగా పెద్దకోడలు ప్రజ్ఝా చౌదరీ భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.
అయితే సతీష్ చౌదరీ తన కోడలి తోపాటు భార్య ఇతరులతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారనే అనుమానాలు పెంచుకున్నాడు. దీంతో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా వారిపై దాడి చేసి విచక్షణ రహితంగా స్వంత భార్యతోపాటు కోడలిని పోడిచి చంపాడు. అయితే ఇంట్లోనే ఉన్న చిన్న కుమారుడు సౌరభ్ అడ్డుకోబోవడంతో ఆయన పై దాడి జరిపాడు. ఈ నేపథ్యంలోనే సౌరభ్ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.