మగాళ్లను చూస్తోందని బెంగళూరులో భార్య కళ్లు పీకేసిన శాడిస్టు భర్త !
బెంగళూరు: బెంగళూరు దారుణం జరిగింది. తన భార్య పరాయి మగాళ్లను చూస్తోందని సహించలేని శాడిస్టు భర్త రాక్షసుడిలా తయారైనాడు. కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా భార్య కళ్లు పీకేసి ఇప్పుడు నీవు మగాళ్లని ఎలా చూస్తావో చూడూ అంటు ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు.
ఓడిశాకు చెందిన మున్నా, రాధా అనే దంపతులు 15 రోజుల క్రితం ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చారు. మున్నా, రాధ దంపతులు కోత్తనూరు దిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేనహళ్ళిలో నివాసం ఉంటున్నారు. దంపతులు ఇద్దరూ ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
కంపెనీలో పని చేస్తున్న పురుషులతో తన భార్య రాధా చనువుగా ఉంటున్నదని మున్నా అనుమానం పెంచుకున్నాడు. భార్య రాధాతో ఇదే విషయంలో గొడవ పెట్టుకున్నాడు. బుధవారం సహనం కొల్పోయిన మున్నా భార్య రాధా కళ్లు పీకేశాడు.
ఇప్పుడు నీవు మగాళ్లు ఏలా చూస్తావో చూడూ అంటు అక్కడి నుంచి పరారైనారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలిని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిలోని హెబ్బాళ సమీపంలో ఉన్న బ్యాపిస్టు ఆసుపత్రికి తరలించారు. పరారైన మున్నా కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.