ప్రిన్సిపల్ వర్సెస్ టీచర్...! రెసిడెన్సియల్ స్కూల్లో...!!
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర చాల కీలకం , పిల్లలకు విద్యా బుద్దులు నేర్పి సమాజ పోకడలను వివరించి, వారిని ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్యామ్యం చేయాల్సిన పూర్తి భాద్యత కూడ విద్యా వ్యవస్థపై ఉంది. అందుకే గురుదేవోభవ, అచార్య దేవోభవ అనే వ్యాఖ్యలు ఇంకా ప్రస్తావనకు వస్తున్నాయి.
అయితే ఆధునూతన పోకడలో ప్రస్తుతం ఉన్న విద్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులు పక్కదారులు పడుతున్నారు. వాళ్లు నిర్వహించే బాధ్యత నుండి కొంత మంది తప్పుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే స్కూళ్లో విద్యార్థులకు అదర్శంగా నిలవాల్సిన టీచర్లు వారి ముందే అసాంఘిక కార్యకలాపాలకు దిగుతున్న సంఘటనలు ప్రస్తతం ఆందోళన కల్గిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఓడిశాలోని బాలాసోర్ జిల్లా హసన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ రెసిడేన్సియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న రాజీవ్ లోచన్ ..అదే స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేసే సబితా బిశ్వాల్తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే దాన్ని స్కూల్లో బహిరంగంగా విద్యార్థుల ముందు లైంగిక చర్యలకుక పాల్పడడంతో.. గమనించిన కొందరు విద్యార్థులు విషయాన్ని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ప్రిన్సిపల్ చేస్తున్న చర్యలపై విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్కూళ్ అవరణలో పిల్లల ప్రభావం పడేవిధంగా అక్రమ సంబంధ కార్యాకలాపాలు కొనసాగించడం మంచిపద్దతి కాదని హెచ్చరించి వెళ్లారు. అయితే ప్రిన్సిపల్ మాత్రం తన ప్రవర్తనను మార్చుకోకపోవడంతో మరోసారి విద్యార్థులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రిన్సిపల్పై దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అక్రమ సంబంధానికి పాల్పడ్డ ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు