పర్వతారోహకుల మృతదేహలను కనుగోన్న భారత వైమానిక దళం
ఉత్తరాఖండ్లో నందాదేవీ శిఖరంపై ట్రెక్కింగ్కు వెళ్లి తప్పిపోయిన ఎనిమిది మందిలో 5గురి మృతదేహాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు గుర్తించాయి.నందాదేవీ తూర్పు శిఖరం పక్కన ఉన్న శిఖరంపై వైమానిక దళ హెలికాప్టర్లు గాలిస్తుండగా కాలిపోయి ఉన్న అయిదుగురి మృత దేహాలు కనిపించాయి.మరోవైపు తప్పిపోయిన వారి కోసం వెతుకుతున్న సయయంలో మరో నలుగురు తప్పిపోయిన బ్రిటీష్కు చెందిన పర్వాతారోహకులు వైమానిక దళానికి కనిపించారు. దీంతో వారిని వారిని రక్షించారు. ఇక వారు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాలను కనుగొన్నారు అధికారులు
కాగా గత నెల మే 25న యుకేకు చెందిన ప్రముఖ పర్వాతారోహకుడు మార్టీన్ మోరన్ నాయకత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం పర్వాతారోహరణకు వెళ్లారు. అనంతరం వారు సమయానికి చేరుకోలేదు. ఇక పర్వాతరోహణ చేసిన యూకే బృందలో భారత్కు చెందిన చేతన్ పాండే అనే అధికారి కూడ ఉన్నాడు.
ఇక పర్వతారోహన చేసిన వారిలో యూకేకు చెందిన జాన్ మెక్ లారెన్, రిచర్డ్ పేనె, రూపర్ట్ హవేల్లు యూకేకు చెందినవారు కాగా అంటోని సూడేకామ్, రేచల్ బిమ్మేల్, యూఎస్కు చెందినవారు, రూత్ మాక్రెయిన్ ఆస్ట్ర్రేలియాకు చెందినవాడు. కాగా మిగిలిన వారి లభ్యం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పితోరగడ్ జిల్లా మెజిస్ట్ట్రేట్ వీకే జోగాండే తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై కేంద్రానికి నివేదిక కూడ పంపించామని ఆయన చెప్పారు.