ప్రేమ, సెక్స్, పెళ్లి, మంత్రి అండతో కాంగ్రెస్ లీడర్ మాయం, యూట్యూబ్ యువతి వీడియో !
బెంగళూరు: ప్రేమించి, లైంగిక కోరికలు తీర్చుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కాంగ్రేస్ పార్టీ నాయకుడు మంత్రి అండతో యువతిని నడిరోడ్డు మీద వదిలేసిన ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళలో జరిగింది. బాధిత యువతి ఫిర్యాదు చేసినా మంత్రి పీఏ బెదిరించడంతో పోలీసులు సైతం చేతులు ఎత్తేశారు. యువతి ప్రైవేట్ వీడియో యూట్యూబ్ లో పెట్టిడటంతో ఆమె ఆందోళనకు దిగింది.
కాంగ్రెస్ లీడర్
మంగళూరు సమీపంలోని బంట్వాళకు చెందిన యువతి మంగళూరులోని ఎంఎన్ సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. కర్ణాటక మంత్రి రామనాథ్ రైకి అత్యంత సన్నిహితుడు అంటున్న పురుషోత్తం కోయల ఓ కార్యక్రమంలో యువతిని పరిచయం చేసుకున్నాడు.
వ్యామోహం తీరింది
ప్రసిద్ది చెందిన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని యువతిని పురుషోత్తం నమ్మించి తరువాత ప్రేమ పేరుతో ఆమెకు దగ్గర అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతితో లైంగిక కోరిక తీర్చుకుంటూ వచ్చాడు. యువతి మీద వ్యామోహం తీరడంతో పెళ్లి చేసుకోనని పురుషోత్తం ఎదురుతిరిగాడు.
యూట్యూబ్ లో అశ్లీల వీడియో
యువతి అశ్లీల వీడియో తీసిన పురుషోత్తం వాటిని యూట్యూబ్ లో పెట్టి యువతి పరువుతీశాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో పురుషోత్తం ఆమెతో నిశ్చితార్థం చేసుకుని మార్చి 4వ తేదీ (గతనెల) పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. వివాహ పత్రికలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.
పెళ్లికొడుకు రివర్స్
పెళ్లి రోజు దగ్గర పడుతున్న సమయంలో నేను పెళ్లి చేసుకోను నీకు దిక్కున్నచోట చెప్పుకో అని ఎదురుతిరిగిన పురుషోత్తం మాయం అయ్యాడు. మోసం జరిగిందని గుర్తించిన యువతి బంట్వాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకుడిని రక్షించడానికి మంత్రి రామనాథ్ రై పీఏ, బంట్వాళ బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు జగదీష్ కోయల రంగంలోకి దిగాడు.
ముగ్గురి మీద కేసు
తనను మోసం చేసి అన్యాయం చేశారని, పోలీసులు కేసు నమోదు చేసినా నిందితులను అరెస్టు చెయ్యకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని యువతి ప్రియుడు పురుషోత్తం, అతని స్నేహితులు జగదీష్, ప్రవీణ్ ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మంత్రి గెలిస్తేనే పెళ్లి
పోలీసులకు యువతి ఫిర్యాదు చెయ్యడంతో మాయం అయిన పురుషోత్తం ఇప్పుడుడ మరో మెలికపెట్టాడు. మంత్రి రామనాథ్ రై శాసన సభ ఎన్నికల్లో గెలిస్తేనే పెళ్లి చేసుకుంటాను అని పురుషోత్తం అంటున్నాడని యువతి ఆరోపిస్తున్నది.
మంత్రి అండతో మోసం
పురుషోత్తం కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినందు వలనే మంత్రి రామనాథ్ రై అతన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని, తన జీవితం గురించి ఆలోచించడంలేదని యువతి ఆరోపిస్తోంది. కేసు నమోదు అయ్యి మూడు రోజులు అయినా మంత్రి రామనాథ్ రై ఒత్తిడితోనే పురుషోత్తం తదితరులను అరెస్టు చెయ్యలేదని యువతి మీడియాకు చెప్పింది.