నిన్నటి దాకా ముఖ్యమంత్రి, సాధారణ వ్యక్తిలా స్లీపర్ క్లాస్లో ఇలా..
తిరువనంతపురం: మాజీ ముఖ్యమంత్రి స్లీపర్ క్లాస్ కంపార్టుమెంటులో సాధారణ పౌరుడిలా ప్రయాణించాడు. ఈ సంఘటన కేరళలో సోమవారం నాడు జరిగింది. మామూల వ్యక్తిలా పడుకున్న అతనిని తోటి ప్రయాణీకులు ఎవరు కూడా మొదట గుర్తించలేదు.
కానీ ఆ తర్వాత గుర్తించారు. మాజీ ముఖ్యమంత్రి సాధారణ పౌరుడిలా ప్రయాణించడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ప్రయాణం చేసింది.. మాజీ సీఎం ఊమెన్ చాందీ. ఆయన సోమవారం నాడు స్లీపర్ క్లాస్లో తిరువనంతపురం వరకు 160 కిలో మీటర్ల మేర ప్రయాణించారు.
ఇప్పుడు ఈ వార్త మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు ఆయన పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.
This happens only in Kerala. Former Kerala CM @Oommen_Chandy travelling in sleeper class train from Kottayam to Trivandrum. Simple & humble pic.twitter.com/QRXVyHzrDF
— MATTS ON (@MATTSMATTS) October 10, 2016
తన సాధారణ ప్రయాణం పైన ఊమెన్ చాందీ స్పందించారు. తనకు స్లీపర్ క్లాస్లో వెళ్లటమంటే చాలా ఇష్టమని, పెద్దగా రద్దీ ఉండదని, దూర ప్రయాణాలకు ఇది బాగుంటుందని, తనకు ప్రజలతో కలిసి వెళ్లటమంటే ఇష్టమని, లేకుంటే ఒంటరిగా ఉన్నట్లుగా భావిస్తానని, తనకు వీఐపీ ట్రీట్మెంట్పై నమ్మకం లేదన్నారు.
కాగా, ఈ ఏడాది మేలో ఆయన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత వారం రోజులకే ఆయన కొల్లాం నుంచి తిరువనంతపురం బస్సులో ప్రయాణించారు. ఓ రాజకీయ సమావేశానికి రైలు టిక్కెట్లు లభించక పోవడంతో బస్సులో ప్రయాణించారు.