కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో కొనసాగుతున్న కాల్పులు...మరో జవాను మృతి..
ఉగ్రవాదులను ఏరివేసేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీర్పీఎఫ్తోపాటు జమ్మ,కశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కోనసాగుతోంది. ఈనేపథ్యంలోనే సోమవారం నుండి ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో అనంతనాగ్ జిల్లాలో వాగ్ హోం ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ చేస్తన్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో సోమవారంఓ ఆర్మీమేజర్ సైతం మృత్యువాత పడగా మంగళవారం తెల్లవారుజామున కూడ మరో సైనికుడు కూడ ఉగ్రవాద దాడుల్లో మృత్యువాత పడ్డాడు..
దీంతో గత రాత్రీ నుండి కొనసాగుతున్న కాల్పుల్లో జవాన్ కూడ మృత్యువాత పడగా మరోక జవాను గాయల పాలయినట్టు తెలుస్తోంది. మరోవైపు కాల్పుల నేపథ్యంలోనే ఇద్దరు లేదా ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే జమ్ము కశ్మీర్లో హై పీవోకే వెంట హై అలర్ట్ కొనసాగుతుంది. దీంతోపాటు సోమవారం సాయంత్రం పుల్వామా జిల్లాలోని ఉగ్రవాదులు పోలీసు వాహనంపై దాడులు చేశారు.
ఇటివల కశ్మీర్లోని ఎన్కౌంటర్లో చనిపోయిన తీవ్రవాది జకీర్ మూస మృతికి నిరసనగా ప్రతికారదాడులకు తీర్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్దంగా ఉన్నాయనే సమాచారం మేరకు కశ్మీర్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ తీవ్రవాదీ బుర్హాన్ వాణి ప్రధాన అనుచరుడు జకీర్ మూస మే 24న జరిగిన భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్లో మృత్యువాత పడ్డాడు. దీంతో ఆ ఎన్కౌంటర్కు నిరసనగా పలు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు.