ప్రత్యేక అతిథితో మోడీ ... కాసేపు ప్రపంచాన్ని మరిచిన ప్రధాని.
పార్లమెంటులో ప్రధాని మోడీ చాంబర్లో ఓ ప్రత్యేక అతిథి దర్శనమిచ్చాడు. ఆ అతిథిని చూడగానే మోడీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కాసేపు ఆ అతిథితో ఆడుకున్నాడు.... ఆడించాడు. ఆ తర్వాత కబుర్లు చెప్పాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అతిథి ఎవరో తెలుసా..?
మోడీ ఛాంబర్లో ప్రత్యేక అతిథి
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ చాంబర్లో ఓ బుల్లి బుడతడు ప్రత్యక్షమయ్యాడు. సభలో విపక్షాల ప్రశ్నలకు ధీటైన జవాబు ఎలా ఇవ్వాలో ఇక్కడే కూర్చుని వ్యూహాలను సిద్ధం చేసే ప్రధాని ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. బుడతడిని ఎత్తుకుని ఆడించారు. తాను ఆడుకున్నారు. ప్రధాని తన ఒల్లో ఆ చిన్నారిని కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. చాలా రిలాక్స్డ్గా కనిపించారు. ఆ బాబుకు చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఇక ఆ బుడతడు మోడీ టేబుల్ పై ఉన్న చాక్లెట్లు చూసి వాటిని అందుకునే ప్రయత్నం చేస్తుండగా మోడీ ఆ బుడతడిని అలానే చూస్తుండిపోయారు. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన మోడీ ఓ ప్రత్యేకమైన అతిథి తనను కలిసేందుకు వచ్చాడంటూ రాశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మోడీ తాతతో ఆడుకున్న బుడ్డోడు
ఇక ఆ బాబు ఎవరో ఎలా వచ్చారో అన్న సంగతి మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ తన పోస్టులో తెలపలేదు. ఆ తర్వాత మరో ఫోటోలో ఈ బాబు ఎవరన్న సంగతి బయటపడింది. ఈ బుడ్డోడు రాజ్యసభ ఎంపీ సత్యనారాయణ్ జతియాస్ మనవడు. మోడీ బుడతడితో ఆడుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కొద్ది క్షణాల్లోనే కొన్ని లక్షల మంది వీక్షించారు. తమదైన శైలిలో సరదా రిప్లై ఇచ్చారు.
గతంలో కూడా చిన్నారులతో సరదాగా గడిపిన మోడీ
ఇలా ప్రధాని చిన్నారులను ముద్దు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా చాలా మంది చిన్నారులను ఎత్తుకుని ఆడించారు... లాలించారు. 2014లో అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రదాని మోడీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ను ఎత్తుకుని కాసేపు ఆడుకున్నారు. అంతేకాదు ఇస్కాన్ టెంపుల్కు మెట్రోలో వెళ్లిన ప్రధాని ఓ బుడతడితో ఆడుకునే వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇక 2017 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు మోడీని కలిసేందుకు రాగా.. ప్రొటోకాల్ పక్కనబెట్టి వారితో గడిపాడు.