చిన్మయానంద కేసు : సిట్, ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రిం ఆదేశం
ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ లా విద్యార్థినిపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్న బీజేపీ సినియర్ నేత స్వామి చిన్మయానంద కేసుకు సంబంధించి ప్రత్యేక ఇన్విస్టిగేషన్ టీంను (సిట్ ) ను ఐజి ర్యాంకు అధికారితో ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రిం కోర్టు ఆదేశించింది.దీంతోపాటు కేసును విచారించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టును సైతం అదేశించింది
గత వారం రోజుల క్రితం యూపికి చెందిన 23ఎళ్ల లా విద్యార్థిని స్వామి మాజీ ఎంపీ బీజేపీ నేత స్వామి చిన్మయానంద వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడీయాలో వీడియోను పోస్టు చేసిన ఆమే రాజస్థాన్కు పారిపోయింది. దీంతో విషయం వైరల్ అయిన విషయం తెలిసిందే... ఈనేపథ్యంలోనే విద్యార్థిని తండ్రి తన కూతురు వేధింపులకు గురి కావాడంతో చిన్మాయనంద పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశాడు.
వేధింపుల అంశాన్ని కొంతమంది అడ్వకేట్స్ సుప్రిం కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో సుమోటగా స్వికరించింది. ఈ నేపథ్యంలోనే గత శుక్రవారం సాయంత్రం, జస్టిస్ ఆర్ బానుమతి మరియు ఎ ఎస్ బోపన్న యువతి తల్లిదండ్రులను తీసుకురావడానికి మరియు వారి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక బృందాన్ని పంపమని డిల్లీ పోలీసు కమిషనర్ను ఆదేశించారు.మరోవైపు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడటానికి ల్యాండ్లైన్ ఫోన్ను ఏర్పాటు చేయాలని చెప్పింది. మరోవైపు కోర్టు సోమవారం ఆమెను కలిసే వరకు ఆమెను మరెవరినీ కలవకుండా నిరోధించాలని ఆదేశాలు జారీ చేసింది.