క్యా బాత్ హై : బహిరంగ సభలో గాలి దుమారం.. అదే స్పీడ్తో కాంగ్రెస్ విజయమట..!
లక్నో : సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడటం రాజకీయ నేతలకు తెలిసినంత మరెవరికి తెలియదేమో. ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వారికి వారే సాటి. తాజాగా లోక్సభ ఎన్నికల వేళ సేమ్ ఇలాంటి సిట్యువేషన్ దర్శనమిచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సడెన్ గా గాలిదుమారం వీయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడం చర్చానీయాంశమైంది.
వైరల్ : ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!
A storm rips the tents at the Congress rally in Saharanpur before Rahul Gandhi and Priyanka Gandhi Vadra reach. A local leader at the stage says this is the "storm of Hindu-Muslim unity, the storm of the Congress party" @the_hindu @THNewDelhi pic.twitter.com/KlqyrJ0FSs
— Damini Nath (@DaminiNath) April 8, 2019
ఒకవైపు గాలిదుమారం వీస్తున్నా.. మైక్ అందుకున్న ఓ లీడర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ గాలి దుమారం కాంగ్రెస్ విజయానికి ముందస్తు సూచిక అంటూ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి ఈ గాలి దుమారం నిదర్శనమన్నారు. అదలావుంటే గాలులు బాగా వేగంగా వీయడంతో రాహుల్, ప్రియాంక తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.