వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్యా బాత్ హై : బహిరంగ సభలో గాలి దుమారం.. అదే స్పీడ్‌తో కాంగ్రెస్ విజయమట..!

|
Google Oneindia TeluguNews

లక్నో : సందర్భానికి తగ్గట్లుగా మాట్లాడటం రాజకీయ నేతలకు తెలిసినంత మరెవరికి తెలియదేమో. ఎలాంటి పరిస్థితినైనా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వారికి వారే సాటి. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ సేమ్ ఇలాంటి సిట్యువేషన్ దర్శనమిచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సడెన్ గా గాలిదుమారం వీయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవడం చర్చానీయాంశమైంది.

<strong>వైరల్ : ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!</strong>వైరల్ : ఓట్ల పండుగకు ఆహ్వాన పత్రిక.. వేదిక, ముహుర్తం తెలుసుగా.!

A storm rips the tents at the Congress rally in Saharanpur
ఎన్నికల ప్రచారంలో భాగంగా షహరన్ పూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సభకు హాజరుకావాల్సి ఉంది. అయితే గాలిదుమారం వీయడంతో టెంట్లు ఎక్కడికక్కడ చిరిగిపోయాయి. దాంతో అక్కడి పరిస్థితి గందరగోళంగా తయారైంది.

ఒకవైపు గాలిదుమారం వీస్తున్నా.. మైక్ అందుకున్న ఓ లీడర్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ గాలి దుమారం కాంగ్రెస్ విజయానికి ముందస్తు సూచిక అంటూ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పడానికి ఈ గాలి దుమారం నిదర్శనమన్నారు. అదలావుంటే గాలులు బాగా వేగంగా వీయడంతో రాహుల్, ప్రియాంక తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.

English summary
A storm rips the tents at the Congress rally in Saharanpur before Rahul Gandhi and Priyanka Gandhi Vadra reach. A local leader at the stage says this is the "storm of Hindu-Muslim unity, the storm of the Congress party".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X