కూతురితో పాటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి...
బుల్లితెర నటినటుల అర్ధిక కష్టాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయా...? బయటి ప్రపంచానికి వెలుగులు పంచుతున్న బుల్లి తెర నటులకు తమ జీవితాల్లో మాత్రం వెలుగులకు అవకాశం లేదా...? దీంతో నటులు అర్ధంతరంగా తమ జీవీతాల్ని చాలిస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. చిన్న నటులు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని ఆత్మహాత్యలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈనేపథ్యలోంలోనే మహారాష్ట్రకు చెందిన ఓ బుల్లి తెర నటి ఆర్థిక కారణాలతో తన కూతురిని చంపి తాను ఉరివేసుకుని చనిపోయింది.
మహారాష్ట్రకు చెందిన ప్రాద్న్యా అనే బుల్లితెర నటి తన 17 సంవత్సరాల కూతురు శృతిని చంపి, అనంతరం ఆమే ఉరిపెట్టుకుంది. కాగా 40 సంవత్సరాల వయస్సున్న ప్రాద్న్యా చాల సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆత్మహత్య చేసుకున్న నటి సూసైడ్ నోట్ కూడ రాసింది. ముఖ్యంగా బుల్లి తెరపై గత కొద్ది రోజులుగా అవకాశాలు లేకపోవడంతో పాటు, ఆర్ధిక కారణాల కూడ ఉన్నాయని పోలీసుల విచారణలో తేలింది. మరోవైపు తన భర్త సంపాదన కూడ అంతంత మాత్రంగానే ఉండడంతో చావుకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
కాగా ఈ సంఘటన శనివారం జరిగింది. ఉదయం తన భర్త జిమ్కు పోయిన సంధర్భంలో నటితో పాటు ఆమే కూతురు గదికి తాళం వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్కు వెళ్లి తిరిగి వచ్చిన భర్త చూసే సరికి ఇద్దరు విగత జీవులుగా పడిఉండడంతో విషయాన్ని పోలీసులుకు తెలిపాడు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.