12మంది తెలుగులో.. 2 హిందీలో...11 మంది ఇంగ్లీష్లో ప్రమాణం చేసిన ఎపీ ఎంపీలు
ఏపి ఎంపీలు మొత్తం 25 మంది నేడు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలతో ప్రోటెం స్పికర్ వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఇక ముందుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర్రం నుండి అరకు ఎంపీ మాధవి ప్రమాణ స్వీకారం చేయగా, మొత్తం 25మందిలో 12మంది తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా మరో ఇద్దరు 2 హిందీలో ,మిగిలిన పదకొండు మంది ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు.
ఇక తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంపీ మాధవి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారయణ, అనకాపల్లి ఎంపీ బీశే్ట్టి వెంకట సత్యవతి, ఎంపీ వంగా గీతా, మార్గాని భరత్, వల్లభనేని బాలశౌరి,బాపట్ల ఎంపీ నందిగాం సురేశ్, ఎంపీ తలారీ రంగయ్య,వైఎస్ అవినాష్ రెడ్డి,ఆదాల ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా ,హిందీలో ఎంపీ చింతా అనురాధ టీడీపీ ఎంపీ రాంమోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమాణ పత్రాన్ని చూడకుండానే ప్రమాణం చేసే ప్రయత్నం చేశారు.
ఇక టీడీపీ ఎంపీలు కేశినేని నాని,గల్లా జయదేవ్, ఇంగ్లీశ్లో ప్రమాణం చేయగా వైసీపి నుండి ప్రమాణం చేసిన వారిలో రఘురామ క్రిష్ణ రాజు,కోటగిరి శ్రీధర్, లావు శ్రీ క్రిష్ణదేవరాయులు,మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్ కుమార్,గోరంట్ల మాధవ్,బల్లి దుర్గప్రసాద్ రావు, చిత్తూరు ఎంపీ మిథున్ రెడ్డిలు ఉన్నారు.