వరదలో చిక్కుకున్న రైలు: పట్టాలపైనే నిలిచిపోయింది(వీడియో)
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులతోపాటు రైలు పట్టాలు కూడా నీటి మునిగాయి.
కాగా, భువనేశ్వర-జగ్దల్పూర్ హీరాఖండ్ ఎక్స్ప్రెస్ రాయగడ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ సమీపంలో వరద నీటిలో చిక్కుకుంది. భారీగా పట్టాలపైకి వరద రావడంతో రైలును ఆపేశారు డ్రైవర్.
#WATCH Bhubaneswar-Jagdalpur Hirakhand Express gets stuck after rail tracks were submerged near a station in Rayagada district following heavy rain in the region. #Odisha (Source:Mobile footage) pic.twitter.com/uVUgrYUpd4
— ANI (@ANI) July 21, 2018
పట్టాలు కనిపించకుండా మోకాలు లోతులో వరదనీరు ప్రవహిస్తోంది. ఎక్కడైనా పట్టాలు తప్పి ఉంటాయేమోనని ముందు జాగ్రత్త చర్యగా డ్రైవర్.. రైలును అక్కడే నిలిపి ఉంచారు. వరద నీరు తగ్గకపోవడంతో రైలు పట్టాలపైనే నిలిచిపోయింది రైలు.
రైలులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారో తెలియాల్సి ఉంది. వరద నీరు తగ్గిన వెంటనే రైలు అక్కడ్నుంచి బయల్దేరడం లేదా, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది.