విచారణకు వెళ్లిన ఇన్స్పెక్టర్పై దాడి చేసిన వాటర్ ప్లాంట్ యజమాని, ఆయన అనుచరులు...!
యూపీలో పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు..అక్రమ వాటర్ ప్లాంట్ పై ఫిర్యాదుతో వెళ్లిన పోలీసులకు ఓ యజమాని అతని అనుచరులు చుక్కలు చూపించారు. ప్లాంట్ను ఇన్స్పెక్ట్ చేసి వెళుతున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ జీపుకు అడ్డం తిరిగారు, ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు.
యూపిలోని వారణాసిలో విద్యుత్ చౌర్యం చేస్తూ.. వాటర్ ప్లాంట్ నడుపుతున్నాడనే ఫిర్యాదుతో విద్యుత్శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ ఆర్వో ప్లాంట్ విచారణకు వెళ్లాడు. వాటర్ ప్లాంట్ కోసం అక్రమ విద్యుత్ను వాడుతున్నారని నిర్థారణకు వచ్చిన అనంతరం విచారణ చేశాడు.అయితే విచారణలో భాగంగా విద్యుత్ చౌర్యం చేస్తూ బుక్ అయ్యాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ అనంతరం వెనుదిరిగారు.
అయితే ఇన్స్పెక్టర్ వెనుదిరగడంతో యజమాని, అతని అనుచరులు ఇన్సెపెక్టర్ జీపుకు అడ్డం తిరిగారు.అనంతరం ఆయన ఫోన్ను గుంజుకున్నారు. వారిపై దాడి చేశారు. దీంతో విషయం జిల్లాలోని ఎస్సీకి చేరడంతో వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాటర్ ప్లాంట్ను కూడ సీజ్ చేశారు. శ్రీవాస్తవ పోలీసు కేసు నమోదు చేయడంతో దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.