నీలిచిత్రాలు చూస్తూ అసహజ శృంగారానికై టెక్కీ ఒత్తిడి, భర్తపై పోలీసులకు ఫిర్యాదు
అసహజ శృంగారం కావాలని వేధిస్తున్న టెక్కీ భర్తపై ఓ భార్య ఫిర్యాదు చేసింది. భర్త వేధింపులు భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది.ఈ కేసును బెంగుళూరుకు బదిలీ చేశారు ఛత్తీస్ ఘడ్ పోలీసులు. భర్త వేధింపులు భర
బెంగుళూరు: అసహజ శృంగారం కావాలని వేధిస్తున్న టెక్కీ భర్తపై ఓ భార్య ఫిర్యాదు చేసింది. భర్త వేధింపులు భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించింది.ఈ కేసును బెంగుళూరుకు బదిలీ చేశారు ఛత్తీస్ ఘడ్ పోలీసులు. భర్త వేధింపులు భరించలేకే పోలీసుల వరకు వెళ్ళాల్సివచ్చిందని బాధితురాలు చెబుతోంది.
బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ అసహజ శృంగారం చేయాలని భార్యను ఒత్తిడి చేసేవాడు. పడకగదిలో తమ శృంగారకార్యక్రమాలను సెల్ ఫోన్ లో రికార్డు చేసేవాడు. ప్రతిరోజూ నీలిచిత్రాలు చూస్తు అందులో ఉన్నట్టు సెక్స్ కావాలని భార్యను వేధించేవాడు.
అయితే ప్రతిరోజూ భార్యపై పెట్టే వేధింపులను భరించలేక భార్య విసిగిపోయింది.అయితే తాను చెప్పినట్టు వినకపోతే పడకగడిలో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను పుట్టింటివారికి పంపుతామని బెదిరించేవాడు.
ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పుట్టింటికి వెళ్ళిపోయింది. బెంగుళూరుకు చెందిన టెక్కీకి ఛత్తీస్ ఘడ్ కు చెందిన యువతికి ఆరేళ్ళక్రితం వివాహమైంది. వీరు బెంగుళూరులోని వివేకనగర్ పరిధిలోని ఈజీపురలో నివాసం ఉంటున్నారు.
పెళ్ళైన కొత్తగా బాగానే ఉన్నప్పటికీ, తర్వాతకాలంలో భార్త వికృత మనస్తత్వం భార్యకు తెలిసింది.అయితే రోజురోజుకు భర్త వేధింపులు పెరగడంతో భరించలేక ఆమె పుట్టింటికి వెళ్ళింది. అంతేకాదు భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును ఛత్తీస్ ఘడ్ పోలీసులు బెంగుళూరు నగరంలోని వివేక్ నగర్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు.