మహిళా పారిశ్రామికవేత్త అనుమానాస్పద మృతి, కంపెనీ ఉద్యోగి కోసం భర్తతో గొడవ!
చెన్నై: చెన్నైకి చెందిన మహిళా పారిశ్రామికవేత్త అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించారు. చెన్నైలోని కోఠారి రోడ్డులో నివాసం ఉంటునమన రీతా లంకలింగమ్ (49) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించారు. కంపెనీలో పని చేస్తున్న ఓ వ్యక్తి విషయంలో భర్తతో గొడవపడిన రీతా లంకలింగమ్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!
ల్యాన్సన్ టయోటాలో రీతా లంకలింగమ్ జాయింట్ డైరెక్టర్. రీతా లంకలింగమ్ భర్త లంకలింగమ్ మురుగేష్ ల్యాన్సన్ టయోటా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. ఇదే కంపెనీలో ఉని చేస్తున్న ఓ ఉద్యోగిని మందలించే విషయంలో రీతా లంకలింగమ్, ఆమె భర్త లంకలింగమ్ మురుగేష్ మద్య వాగ్వివాదం జరిగిందని సమాచారం.
కంపెనీ ఉద్యోగి విషయంలో రీతా లంకలింగమ్, లంకలింగమ్ మురుగేష్ ల మద్య గొడవ తారాస్థాయికి చేరింది. గత రాత్రి లంకలింగమ్ మురుగేష్ ఇంటికి రాకుండా హోటల్ లో ఉండిపోయారు. ఉదయం ఎంత సేపటికి రీతా లంకలింగమ్ బయటకు రాకపోవడంతో సూపర్ వైజర్ వెళ్లి చూడగా రీతా లంకలింగమ్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించారు.
ఈడీ ముందు హాజరైన ఐశ్వర్య, రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది, కూతురు పేరుతో డీకే!
విషయం తెలుసుకున్న లంకలింగమ్ మురుగేష్ ఇంటికి చేరుకుని తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సమస్యల కారణంతో రీతా లంకలింగమ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రీతా లంకలింగమ్ ఆత్మహత్య చేసుకునే ముందు ఎలాంటి సూసైడ్ నోట్ రాసి పెట్టలేదని పోలీసులు అంటున్నారు. తమిళనాడులోని తుత్తుకుడికి చెందిన రీతా లంకలింగమ్ భర్త లంకలింగమ్ మురుగేష్ తో కలిసి చెన్నైలో నివాసం ఉంటున్నారు.