రెండో కాన్పులో కవల పిల్లలు, అత్తింటివారు అలిగారు: తల్లి ఏం చేసిందంటే, గట్టిగా హత్తుకుని !
రెండో కాన్పులో ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వారు ఆగ్రహించడం, భర్త ముఖం చాటేయ్యడంతో మనస్తాపానికి గురైన మహిళ కవలలైన పసికందులను చంపేసింది. విషయం తెలుసుకున్న భర్త కవలలైన పసికందులను సొంత పోలంలో పాతిపెట్టేశ
చెన్నై: రెండో కాన్పులో ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వారు ఆగ్రహించడం, భర్త ముఖం చాటేయ్యడంతో మనస్తాపానికి గురైన మహిళ కవలలైన పసికందులను చంపేసింది. విషయం తెలుసుకున్న భర్త కవలలైన పసికందులను సొంత పోలంలో పాతిపెట్టేశాడు.
కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ లో ఈ దారుణం జరిగింది. పసికందులు పాలుతాగుతూ ఊపిరి ఆడకపోవడంతో మరణించారని ఇరుగు పోరుగు వారిని నమ్మించారు. చివరికి అధికారుల జోక్యంతో పోలీసులు విచారణ చెయ్యగా అసలు విషయం వెలుగు చూసింది.
రెండేళ్ల కుమార్తె !
కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ సమీపంలోని కాట్రాడితట్టు ప్రాంతంలో కన్నన్ (39), దివ్య (29) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. దివ్య మళ్లీ గర్బవతి అయ్యింది. మే 22వ తేదీన ప్రైవేటు ఆసుపత్రిలో దివ్య ఇద్దరు ఆడపిల్లలు (కవలలు)కు జన్మనిచ్చింది.
పట్టించుకోని భర్త, ఆగ్రహాం !
దివ్య మళ్లీ ఇద్దరు ఆడిపిల్లలకు జన్మనిచ్చిందని తెలుసుకున్న భర్త కన్నన్ అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. అత్తింటివారు ఆగ్రహించారని తెలుసుకున్న దివ్య కుమిలిపోయింది. వేరే దారిలేక పిల్లలను వెంట పెట్టుకుని పుట్టింటికి వెళ్లింది.
అత్తింటి వారు రాలేదని విరక్తి !
తనను తన బిడ్డలను చూడటానికి భర్త కన్నన్ తో పాటు అత్తింటివారు రాలేదని దివ్య తన గోడును చుట్టుపక్కల వారికి చెప్పింది. జూన్ రెండవ తేదీన ఇద్దరు ఆడపిల్లలు ఆకస్మికంగా మృతి చెందారు. తల్లి పాలు తాగుతున్న సమయంలో కవలలు ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారని చుట్టు పక్కల వారిని నమ్మించారు.
పిల్లలను పాతి పెట్టిన కన్నన్ !
కన్నన్ గుట్టు చప్పుడు కాకుండా పిల్లల మృతదేహాలను తీసుకెళ్లి తన సొంత ఊరు కాట్రాడితట్టులో పాతిపెట్టాడు. చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కుముదకు ఫిర్యాదు చేశారు. కుముద ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరం అంగీకరించిన తల్లి
అత్తింటి వారు అలగడంతో తన ఇద్దరు బిడ్డలను గట్టిగా హత్తుకోవడంతో ఊపిరాడక మరణించారని తల్లి దివ్య నేరం అంగీకరించింది. కవలల మృతదేహాలను బయటకు తీసి వైద్య పరీక్షలు చేశారు. దివ్య, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని నాగర్ కోవిల్ పోలీసులు తెలిపారు.