చనిపోతున్నా అంటూ లేఖ... కుటుంబ సభ్యుల ఆందోళన... చివరికి ఎమైందంటే....
ఢిల్లీలో ఓ మహిళ ఆత్యచేసుకున్నట్టు అందరిని నమ్మించింది. ఘజియాబాద్లోని హిండాన్లోని నదీ తీరం వద్ద తన కారును పార్క్ చేసి, అందులో సూసైడ్ నోటు రాసింది. దీంతో సదరు మహిళ కుటుంభ సభ్యులతో పాటు పోలీసులు మహిళ శవం గత మూడు రోజులుగా జాలర్లతో వెతుకుతున్నారు. అయితే అకస్మత్తుగా మహిళ బెంగళూర్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఢిల్లీకి చెందిన కోమలి అనే మహిల ఇన్స్యూరెన్స్ కంపనీలో ట్రైనింగ్ మేనేజర్గా ఉద్యోగం చేస్తుంది. కాగా భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ కార్యదర్శి కూతురు కూడ. అయితే ఆమే కుటుంభ కలహాలతో జులై ఆరున ఉత్తర ప్రదేశ్లోని ఘజీయాబాద్లో ఉన్న హిండాన్ నది తీరానికి వెళ్లింది. నదిలో దూకి ఆత్మహాత్య చేసుకోవాలని భావించింది. ఇందుకోసం సూసైడ్ లేటర్ను కూడ కారులో రాసి పెట్టింది.
ఇక విషయం తెలిసిన కుటుంభ సభ్యులు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు పరిస్థితి బట్టి ఆమే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందని భావించారు. మరోవైపు భర్తతోపాటు అత్తమామాల వేధింపుల వల్లే ఆమే ఆత్మహత్య చేసుకుందని కోమలి తండ్రీ పోలీసులకు పిర్యాధు చేశారు. పోలీసులకు పిర్యాధు చేయడంతో గజ ఈతగాళ్లతో కోమలి శవం కోసం మూడు రోజులుగా గాలింపు చేపట్టారు.
కాగా పోలీసులు మరో కోణంలో కూడ ఆలోచించారు. ఆమేకు ఉన్న స్నేహితుల సమాచారం సేకరించారు. దీంతో రాజస్థాన్లో ఆమే స్నేహితుల వద్దకు వెళ్లారు. అయితే అక్కడ వారు సమాచారంతో ముంబాయిలో ఉన్నట్టు కనుగోన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు బెంగళూర్లో ఉన్నట్టు తెలిపారు. దీంతో ఫైనల్గా బెంగళూర్ లో ఉన్న కోమలిని పోలీసులు పట్టుకున్నారు.