అత్తింటి వేధింపులా మజాకా..! వేధింపులు తాళలేక నగ్నంగా రోడ్డుపైకి వచ్చిన మహిళ
అత్తింటి వేధింపులకు ఓ మహిళ నగ్నంగా అందరు చూస్తుండగానే రోడ్డుపై పరుగులు పెట్టింది. తాను ఏం చేస్తున్నానో తెలియకుండానే రోడ్డుమీదకు వచ్చింది. దీంతో అత్తింటివారిపై కేసును నమోదు చేసేందుకు నేరుగా పోలీస్ స్టేషన్కు బట్టలు లేకుండా వచ్చిన దురదృష్ట ఘటన రాజస్థాన్ లో జరిగింది.
అధునిక భారత దేశంలోకూడ అత్తింటి వేధింపులకు మాత్రం ఫుల్ స్టాప్ పడడంలేదు..భర్త వేధింపులకు గురిచేస్తే కాపాడాల్సిన అత్తమామలు కోడళ్ల పాలిట యమదూతలు అవుతున్న సంఘటనలు దేశంలో రోజు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అత్తింటి వేధింపులు భరించలేక నగ్నాంగానే రోడ్డుమీదకు వచ్చిన అమానవీయ సంఘటన రాజస్గాన్ లోని చురు జిల్లాలో జరిగింది.
మహారాష్ట్ర్రలోన అకోలాకు చెందిన ఓ మహిళకు రాజస్థాన్ లోని చురు ఓ వ్యక్తితో కొన్ని ఏళ్ల క్రితం పెళ్లి జరగింది. దీంతో కారణాలేమైనా ఆమేకు అత్తింటి నుండి వేధింపులు ప్రారంభమైయ్యాయి. వేధింపుల నేపథ్యంలోనే ఆమే బట్టలు సైతం చింపి రోడ్డు పైకి నెట్టివేశారు. దీంతో చింపిన బట్టలతోనే.. అలా ప్రాణ భయంతోనే నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాధు చేసింది. దీంతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..
కాగా బాధితురాలు బట్టుల లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్పప్పుడు కొంతమంది ఫోటోలు తీశారు. మరోవైపు రోడ్డుపై ఉన్న సీసీ కెమేరాల్లో కూడ ఆమే వీడీయో రికార్డ్ అయింది. దీంతో పోలీసులు ముందుగా సీసీ కెమారాల్లో నమోదైన వీడీయోను తొలగించారు. అనంతరం ఫోటోలు తీసీన వారిపై కూడ కేసులు నమోదు చేశారు.