మరో ట్రిపుల్ తలాక్ మర్డర్....! ఫోన్లో ట్రిపుల్ తలాక్.. అంగీకరించని భార్యకు నిప్పు
దేశంలో ఉన్న ముస్లిం మహిళల రక్షణ కోసం కేంద్రం పలు చర్యలు చేపట్టింది. ఇటివల ప్రత్యేక ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయినా ట్రిపుల్ బాధితుల అర్తనాదాలు మాత్రం అగడం లేదు. కేంద్రం భావించినట్టుగా ముస్లిం మహిళలకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిన ట్రిపుల్ చెప్పేందుకు భర్తలు మాత్రం వెనకడుకు వేయడం లేదు.. పైగా తాము కోరుకున్నట్టుగా ట్రిపుల్ తలాక్ చెప్పని భార్యలను చిత్రహింసలకు గురి చేసి హత్యలు కూడ చేస్తున్న సంఘటనలు ట్రిపుల్ తాలక్ బిల్లు అమల్లోకి వచ్చిన మరునాటి నుండే దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రిపుల్ తలాక్కు అంగీకరించని మరో మహిళను భర్త చిత్రహింసలకు గురి చేసి హత్యచేశాడు.
యూపిలోని ఇండియా, నేపాల్ బార్డర్కు సమీపంలో ఉన్న గంద్రా గ్రామానికి చెందిన సయిదా మరియు నఫీస్కు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహాం జరిగింది. కాగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా నఫిస్ ముంబాయిలో ఉద్యోగం చేస్తాడు. అయితే నఫీస్ తన భార్యను హింసించే మనస్తత్వం దీంతో పిల్లల ముందే భార్యను చితకబాదుతాడని సయిదా తండ్రి తెలిపాడు. కాగా ఇద్దరి మధ్య తరచు ఘర్షణలు జరిగేవని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 6న ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పాడు. దీనికి సయిదా ఒప్పుకోలేదు.
దీంతో ఈద్ పండగకు ముంబయి నుండి తిరిగి వచ్చిన నఫీస్తో సయిదా తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. అయితే నఫీస్ మాత్రం వినకుండా భార్యను బలి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తల్లితో కలిసి పిల్లల ముందే చంపి కాల్చివేశారని సయిదా తండ్రి ఆరోపణలుచేశాడు. కాగా పోలీసులు నఫీస్తో పాటు అత్తమామాలతో పాటు మొత్తం ఎనిమిదిమందిపై కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు. అయితే వరకట్నం కేసు క్రింద నమోదు చేసిన పోలీసులు ట్రిపుల్ తలాక్కు సంబంధించి విచారణ జరుపుతున్నారు