వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక పేలుళ్లలో భారతీయ మహిళ దుర్మరణం! బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి..!

|
Google Oneindia TeluguNews

మంగళూరు: శ్రీలంకలో వరుసగా చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనల్లో ఓ భారతీయురాలు దుర్మరణం పాలయ్యారు. ఆమెను కర్ణాటకలోని మంగళూరుకు చెందిన రెజీనా ఖాదర్ కుక్కాడి. వయస్సు 58 పంవత్సరాలు. ఆమె స్వస్థలం సూరత్ కల్. మంగళూరు సమీపంలోని బైకంపాడికి చెందిన అబ్దుల్ ఖాదర్ కుక్కాడిని వివాహం చేసుకున్నారు. రెజీనా తన భర్త అబ్దుల్ ఖాదర్ తో కలిసి చాలాకాలం పాటు బైకంపాడిలో నివాసం ఉన్నారు. అనంతరం- కుక్కాడి దంపతులు దుబాయ్ కు వెళ్లిపోయారు.

రెజీనా కుక్కాడి పూర్వీకులు శ్రీలంకకు చెందిన వారు కావడంతో ఆ దేశంలో ఆమెకు పెద్ద సంఖ్యలో బంధువులు, కుటుంబ స్నేహితులు ఉన్నారు. వారిలో చాలామంది కొలంబోలో నివసిస్తున్నారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరు కావడానికి రెజీనా కుక్కాడి.. శుక్రవారం కొలంబోకు వెళ్లారు.

ఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టంఆత్మాహూతి దాడి టార్గెట్ లో భారత రాయబార కార్యాలయం: భద్రత కట్టుదిట్టం

A Women from Mangaluru died in Sri Lanka Blasts

అక్కడి షాంగ్రిలా హోటల్ లో బస చేశారు. ఆమె భర్త అబ్దుల్ ఖాదర్ ఆదివారం నాడు దుబాయ్ నుంచి కొలంబోకు చేరుకోవాల్సి ఉంది. ఆదివారం షాంగ్రిలా హోటల్ పై జరిగిన ఆత్మాహూతి దాడిలో రెజీనా మృత్యువాత పడ్డారు. హోటల్ షాంగ్రిలాపై ఉగ్రవాదిని జెహ్రెయిన్ గా గుర్తించినట్లు శ్రీలంక భద్రతాధికారులు ఇదివరకే ప్రకటించారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యుడని అధికారులు తేల్చారు.

English summary
Regina Khader Kukkadi, A Women from Mangaluru in Karnataka died in an multiple blasts happened in Sri Lanka on Easter Sunday. Shangri La Hotel, where Regina stayed rocks with blasts as Suicide bomber attack. In this incident, Regina died
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X