వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ 2 కోసం ఘర్షణ... కత్తితో పొడవడంతో ప్రాణాలు విడిచిన యువకుడు...!

|
Google Oneindia TeluguNews

గోటితో పోయోదానికి గొడ్డలి దాక తెచ్చుకుంటున్నారు నేటి యువత. క్షణికావవేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జరిగిన తప్పులపై కనీసం ఆలోచించకుండా ఈగోలకు పోయి ఇతరుల ప్రాణాలను సైతం తీస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం రెండు రూపాలయ కోసం ఘర్షణ చెలరేగింది. దీంతో ఒకరికొకరు కొట్టుకోవడంతో మధ్యలో మూడవ వ్యక్తి రావడంతో వివాదం మరింత ముదిరింది. ఇరువర్గాల ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చేసుచేసుకుంది.

a young man was killed for two rupees

జిల్లాలోని కాకినాడ మండలం వలసపాకలలో దారుణ సంఘటన చేసుకుంది. సువర్ణరాజు అనే వ్యక్తి సైకిల్‌లో గాలి నింపుకునేందుకు గ్రామంలో ఉన్న సాంబ అనే వ్యక్తి నడుపుతున్న సైకిల్ షాపుకు వెళ్లాడు. సైకిల్‌లో గాలినింపుకున్నాడు. అయితే అందుకు సంబందించి చార్జీ రెండు రూపాలయాలు ఇవ్వాలని సాంబ సువర్ణరాజును అడిగాడు. దీంతో సువర్ణ రాజుకు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.

నన్నే డబ్బులు అడుగుతావా అంటూ షాపు యజమాని సాంబపై దాడికి ఎగబడ్డాడు. అయితే అక్కడే ఉన్న సాంబ స్నేహితుడు అప్పరావు అడ్డుకుని సువర్ణరాజును క్షణికావేశంలో కత్తితో పోడిచాడు. దీంతో తీవ్ర గాయాలు అయిన సువర్ణరాజును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు. అయితే తీవ్రగాయాలతో కోలుకోలేని సువర్ణరాజు మృతి చెందాడు.

English summary
a young man was killed for two rupees. suvarna raju who died working in cycle shop at valasapakala village of kakinada mandal in east godavari
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X