బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టాడు: అసలేం జరిగిందంటే..?
చెన్నై: ఎన్ని కఠినమై చట్టాలు వచ్చినప్పటికీ యువతులు, మహిళల పట్ల వేధింపులు పెరిగిపోతూనే ఉన్నాయి, తాజాగాతమిళనాడులో వివాహం నిశ్చయమైన యువతికి బలవంతంగా తాళి కట్టాడు ఓ యువకుడు. అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు.
ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!
ఆమెను ప్రేమించాడు కానీ..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆంబూరు సమీపంలోని సాండ్రోర్ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్ అనే యువకుడు.. కళాశాలలో చదువుతున్నప్పటి నుంచి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, ఈ విషయం ఆమెకు చెప్పే ధైర్యం లేక తనలోనే దాచుకున్నాడు.
ఆమెకు పెళ్లి నిశ్చయమవడంతో..
ఇది ఇలావుంటే, ఆ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలిసిన జగన్.. ఆ యువతికి తన ప్రేమ విషయం చెప్పాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అయితే, ఆ యువతి అతడి ప్రేమను నిరాకరించింది. దీంతో ఆ యువకుడు ఆమెపై కోపం పెంచుకున్నాడు.
బస్సులో వెళ్తుండగా తాళి కట్టేశాడు..
ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆ యువతి ఆంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో బయలుదేరగా అతడు కూడా ఆమెను అనుసరించాడు. బస్సులో ఓ సీట్లో కూర్చున్న ఆమె వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో బలవంతంగా కట్టేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు యువకుడ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతడ్ని చితకబాదారు.
చివరకు జైలుకు...
సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందిత యువకుడు జగన్ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు వాణియంబాడి పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వివాహం నిశ్చయమైన యువతికి బలవంతంగా తాళి కట్టడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.