ఆధార్-ప్యాన్ లింక్కు నేడే ఆఖరు తేదీ: చేయకపోతే ఏమవుతుందంటే..?
పాన్తో ఆధార్ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుత గడువు గురురవారం (ఆగస్టు 31)తో ముగుస్తోంది.
Recommended Video
న్యూఢిల్లీ: పాన్తో ఆధార్ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుత గడువు గురురవారం (ఆగస్టు 31)తో ముగుస్తోంది. (అనుసంధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పొడిగించే అవకాశం?
అయితే, ప్యాన్, ఆధార్ అనుసంధానం ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే అవకాశముంది. ప్రస్తుతం ‘ఆధార్ అనుసంధానం' అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై నవంబరులో విచారణ చేపడతామని సుప్రీం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి గడువును డిసెంబరు ఆఖరు ప్రభుత్వం పొడిగించింది.
ఐటీ రిటర్న్ దాఖలే చేయనట్లే..
కాగా,ప్యాన్-ఆధార్కార్డ్ అనుసంధానం చేయకుంటే.. మీరు ఐటి రిటర్న్స్ దాఖలు చేసినా.. దాఖలు చేయనట్లే లెక్కని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ఐటీఆర్ దాఖలు చేయడంతోపాటు ఆధార్ కూడా కీలకంగా మారింది. ఈ ప్రక్రియకు ఆగస్టు 31 వరకు అవకాశముంది.
ఐటీ రిటర్నులు దాఖలు చేయనట్లే..
ఐటీఆర్
దాఖలుచేసి
ఆధార్
అనుసంధానం
చేయకపోతే
దాన్ని
ఐటీ
శాఖ
పరిగణనలోకి
తీసుకోదు.
అంతేగాక,
ఐటీఆర్
దాఖలు
చేయని
వారి
జాబితాలో
వీరిని
చేర్చుతారు.
అలాంటి
వారికి
ఐటీఆర్
సెక్షన్
142(1)
ప్రకారం
నోటీసులు
జారీ
చేస్తారు.
దానికి
రూ.5వేలు
ఫెనాల్టీ
వేస్తారు.
ఆధార్-ప్యాన్ లింక్ చేయకపోతే..
ఆదాయపన్నుతో చేసుకునే క్లైములను చేసుకోలేరు. నష్టాలు, పెట్టుబడి, బిజినెస్ నష్టాలను క్యారీ ఫార్వడ్ చేసుకోలేరు. ఎవైనా రింఫండ్స్ వచ్చేవి ఉంటే వాటిని మంజూరు చేయరు. కొన్ని క్యాటగిరీ వారికి వెసుబాటు ఉంటుంది. ఎన్నారైలు, 80 ఏళ్లకు పైబడిన వారు, అస్సాం, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ ప్రజలకు కొంత వెసులుబాటు ఉంటుంది.