వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కేజ్రీ పార్టీకి షాక్: రూ.30.67కోట్లకు ఐటీ నోటీసులు
విరాళాల వ్యవహారంలో ఢిల్లీ అధికార ఆమ్ఆద్మీ పార్టీకి చుక్కెదురైంది. పార్టీకి అందిన విరాళాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రూ.30కోట్లకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆమ్ఆద్మీ పార్టీకి అందిన విరాళాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రూ.30కోట్లకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై డిసెంబర్ 7లోగా ఆప్ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
పార్టీ ఐదో వార్షికోత్సవం మరుసటి రోజే ఈ నోటీసులు రావడం గమనార్హం. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మొదలైన ఆమ్ ఆద్మీ.. 2012 నవంబర్ 26న రాజకీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.
అయితే తొలినాళ్లలో పార్టీకి భారీగా విరాళాలు అందాయి. వీటిల్లో చాలా వరకు విదేశీయుల నుంచి వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ విరాళాలకు సంబంధించిన వివరాలను ఆమ్ ఆద్మీ పార్టీ అకౌంట్ బుక్స్లో నమోదు చేయడంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
Comments
English summary
Still in a mood of celebration marking five years of foundation, Aam Aadmi Party (AAP) has faced tax heat with the Income Tax (I-T) department serving a Rs 30.67 crore notice to the party. The tax notice has asked AAP why Rs 30.67 crore should not be recovered from the party. It has been asked to furnish a reply by December 7.
Story first published: Monday, November 27, 2017, 17:36 [IST]