మహిళల రక్షణ: ఇక ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలోని బస్సుల్లో మహిళల రక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీలోని రవాణా వ్యవస్థ కారణంగా పలు సందర్భాల్లో అత్యాచారాలు జరుగుతున్న వైనం వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళల రక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడిపే బస్సుల్లో మార్షల్స్ను ఏర్పాటు చేస్తోంది.
గతంలో 2 వేల మంది గార్డులను నియమించినా, వారితో భద్రత సరిపోవడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 200 మంది మార్షల్స్ను నియమించనుంది. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని బస్సుల్లో నియమిస్తారు.
వీరందరికీ వాకీ టాకీలు కూడా ఇస్తారు. వీరి ద్వారా మహిళలకు రక్షణ పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ తాజా చర్యలతో మంచి ఫలితాలుంటాయని అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో మహిళల రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో మహిళలపై జరుగుతున్న వేధింపులను కట్టడి చేస్తామని చెప్పారు.
తమ పార్టీ ఎన్నికల హామీలో భాగంగానే ప్రభుత్వ బస్సుల్లో మార్షల్స్ను నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు తెలిపారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications