వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు మరో షాక్: వివాహేతర సంబంధంపై విశ్వాస్‌కు సమన్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత కుమార్ విశ్వాస్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. విశ్వాస్‌కు తనతో వివాహేతర సంబంధం ఉందనే ఊహాగానాల పైన పెదవి విప్పడం లేదని ఏఏపీలోని ఓ మహిళా కార్యకర్త ఆరోపించినట్లుగా తెలుస్తోంది.

తాను ఫిర్యాదు చేసినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదని ధ్వజమెత్తారని సమాచారం. ఈ తరహా ఆరోపణలు పెరగడంతో తన భర్త వదిలేసి వెళ్లిపోయారని విమర్శించారని, ఈ ఆరోపణలను విశ్వాస్ కనీసం ఖండించకపోవడం సరికాదని ఆమె చెప్పారని తెలుస్తోంది.

AAP Kumar Vishwas

కాగా ఆ యువతి పోలీసు కమిషనర్‌కు లేఖ రాసిందని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ చెప్పారు.

అందువల్లే కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు నోటీసులు పంపామని, మంగళవారం విచారణకు కమిషన్ ఎదుట హాజరై, వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాగా, పార్టీ వాలంటీర్‌తో కుమార్ విశ్వాస్‌కు సంబంధముందని, 2014 ఎన్నికల సమయంలో ఇరువురు కలిసి ఉన్నారని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు, తన పైన వచ్చిన ఆరోపణలను కుమార్ విశ్వాస్ ఖండించారు.

English summary
The Commission for Women in New Delhi has summoned, Kumar Vishwas over a complaint of him having an illicit relationship with a party volunteer of the Aam Admi Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X