ఆరుషి-హేమరాజ్ హత్య కేసులో కొద్దిసేపట్లో కోర్టు తీర్పు
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు (సోమవారం) తీర్పును వెలువరించనుంది. రెండుగంటలకు వెలువడాల్సిన తీర్పులో జాప్యం జరుగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్లు కోర్టుకు హాజరయ్యారు. కేసు తీర్పు నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది.
కోర్టు వద్ద భారీ బందోబస్తు
ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కేసు సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
2008 మే 16న ఆరుషి - హేమరాజ్ల హత్య జరిగింది. ఈ ఘటనపై సిబిఐ కోర్టులో పదిహేను నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది.