ఆరుషి తల్వార్ హత్య కేసు: ఐదేళ్లు ఏం జరిగింది?
నోయిడా: ఆరుషి, హేమరాజ్ జంట హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నోయిడాలో 2008లో జరిగిన ఈ హత్యలపై కేసు గత ఐదేళ్ల కాలంగా నడుస్తూ వచ్చింది. 2008లో 14 ఆరుషి, ఇంటి పనిమనిషి జలవాయు విహార్లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ కేసు విచారణ ఇలా కొనసాగింది.
2008 మే 16: దంత వైద్యులు రాజేష్, నూపుర్ తల్వార్ దంపతుల కూతురు ఆరుషి తల్వార్ కూతురు నోయిడాలోని నివాసంలోని పడకగదిలో గొంతు కోసి చంపడంతో శవమై కనిపించింది. నేపాల్కు చెందిన ఇంటి పనిమనిషి హేమరాజ్ హత్య చేసి ఉండవచ్చునని అనుమానించారు.
మే 17: తల్వార్ నివాసంలోని టెర్రాస్పై హేమరాజ్ శవం కనిపించింది.
మే 18: సర్జికల్ పెర్సిషన్తో హత్యలు చేశారని పోలీసులు చెప్పారు. ఇంటివారే ఈ హత్యలు చేసి ఉంటారని ఆనుమానించారు.
మే 23: జంట హత్యల కేసులో ఆరుషి తండ్రి రాజేష్ తల్వార్ అరెస్టయ్యాడు.
మే 31: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) హత్య కేసు విచారణను తన చేతుల్లోకి తీసుకుంది.
జూన్ 13: రాజేష్ తల్వార్ కాంపౌండర్ కృష్ణను సిబిఐ అరెస్టు చేసింది. పది రోజుల తర్వాత తల్వార్ దంపతుల సేవకుడు రాజ్ కుమార్ను, తల్వార్ దంపతుల పక్కింటి పనిమనిషి విజయ్ మండల్ను సిబిఐ అదుపులోకి తీసుకుంది.
జులై 12: సిబిఐ సాక్ష్యాలను సమర్పించడంలో విఫలం కావడంతో ఘజియాబాద్ కోర్టు రాజేష్కు బెయిల్ మంజూరు చేసింది.
2010 జనవరి 5: తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించింది.
ఫిబ్రవరి 9: ఘజియాబాద్ స్పెషల్ కోర్టు సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును తిరస్కరించింది. రాజేష్, నూపుర్ తల్వార్లను విచారంచాలని ఆదేశాలు జారీ చేసింది. వారిపై సాక్ష్యాలు రూపుమాపడానికి ప్రయత్నాలు చేశారనే ఆరోపణపై కూడా కేసు నమోదైంది. కోర్టుకు హాజరు కానందుకు ఆ దంపతులకు ఘజియాబాద్ కోర్టు బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది.
2012 మార్చి 14: రాజేష్ తల్వార్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ తన వాదనలు కోర్టుకు వినిపించింది.
ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు జరిగింది.
మే 3: సెషన్స్ కోర్టు నూపుర్ తల్వార్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
మే 25: హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలకు సంబంధించిన అభియోగాలను తల్వార్ దంపతులపై మోపారు.
సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాలతో నూపుర్ తల్వార్ బెయిల్పై విడుదలైంది.
2013 ఏప్రిల్: ఆరుషి, హేమరాజ్లను తల్వార్ దంపతులు హత్య చేశారని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ అభ్యంతరకరమైన పరిస్థితిలో, కాంప్రమైంజిగ్ పోజిషన్లో కనిపించారని కూడా సిబిఐ తెలిపింది.
మే 3: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్తో పాటు 14 మందిని సాక్షులుగా పిలుస్తూ సమన్లు జారీ చేయాలని డెఫెన్స్ తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టును కోరారు. సిబిఐ దాన్ని వ్యతిరేకించింది.
మే 6: కేసులో 14 మందికి సమన్లు జారీ చేయాలని కోరుతూ తల్వార్ దంపతులు పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రాజేష్, నూపుర్ తల్వార్ వాంగ్మూలాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబర్ 18: సిబిఐ కోర్టు వాదనలను ముగించింది.