అభివృద్ది నిధులు ఊరికే రావు, ఓట్లేస్తేనే వస్తాయి, మేనకా గాంధి
కేంద్రమంత్రి మేనకా గాంధి మరో వివాదంలో చిక్కుకున్నారు.ఓట్లేసిన గ్రామాలకే అభివృద్ది నిధులు కేటాయిస్తామంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేసే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించి నిధులు కేటాయించి అభివృద్ది చేపడతామని అన్నారు. కాగా గతంలో కూడ ఇక్కడంతా ఇచ్చిపుచ్చుకోవడమే ,ఓటు వేయకపోయినా ఇచ్చుకుంటూ పోవడానికి మేము గాంధి బిడ్డలమా అంటూ కోద్ది రోజుల క్రితం వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.
కాగా దీనిపై ఈసీ నోటీసులు కూడ పంపింది. తాజాగా తన కుమారుడు వరుణ్ గాంధి ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపిలోని పలిబిత్ ఆమే చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాన్నిరేపుతున్నాయి. కాగా పిలిబిత్ లో ప్రతి గెలుస్తున్నాము కాబట్టి ఈ సారి మాత్రం తమకు ఓటు వేసే గ్రామాలను ఏ,బీ,సీ,డీలుగా విభజించారు. తమకు అనుకూలంగా 80 శాతం ఓట్లు వేసిన గ్రామాలను ఏ కేటాగిరిలో, 60 శాతం ఓట్లు వేసిన గ్రామాలను బీ కేటాగిరిలో, 50 శాతం ఓట్లు వేసిన గ్రామాలను సీ కేటాగిరిలో చేర్చుతామని చెప్పారు.
ఇక 50 శాతం కంటే తక్కువ వచ్చిన గ్రామాలను డీ కేటాగిరిలో చేర్చుతామని బహిరంగాగానే ప్రకటించారు.దీంతో దీంతో ఎవరు ఏ,బీ,సీ గ్రామాల్లో ఉంటారో తేల్చుకోవలని హెచ్చరించారు.కాగా గతంలో సుల్తాన్ పూర్ నియోజవర్గం నుండి పోటిచేసిన వరుణ్ గాంధి ఈసారి మేనకా గాంధి నియోజకవర్గమైన పిలిబిత్ నియోజకవర్గం నుండి పోటి చేస్తున్నారు.కాగా మేనకా గాంధి సుల్తాన్ పూర్ నుండి పోటిలో ఉన్నారు.