ఉగ్ర ఘాతుకం: ఆర్మీ అధికారి కిడ్నాప్, దారుణ హత్య
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో లెఫ్ట్నెంట్ ర్యాంక్ ఆర్మీ అధికారి ఉమర్ ఫయ్యజ్ దారుణంగా హత్య చేశారు. ఉమర్ను గత రాత్రి ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
కుల్గాం జిల్లాకు చెందిన ఉమర్.. మంగళవారం షోపియాన్లోని తమ బంధువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు వెళ్లారు. కాగా, బుధవారం ఉదయం హెర్మేన్ ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.
J&K: Bullet ridden body of a Army lieutenant found in Shopian district's Herman, in South Kashmir; identified as Umar Fayaz from Kulgam pic.twitter.com/lmeOU3Kgsa
— ANI (@ANI_news) May 10, 2017
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. తుపాకీతో కాల్చి చంపినట్లు గుర్తించారు. ఉమర్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. సుమారు 3వేల మంది భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నాయి. 30 నుంచి 40మంది మిలిటెంట్ ఈ ప్రాంతంలో తలదాచుకున్నట్లు సమాచారం అందడంతో విస్తృతంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.