పిల్లలు హత్య, లవ్ స్టోరీ చెప్పాలి, చాల మందితో కన్నుగీటు వీడియోలు, వైరల్: డిమాండ్ !
చెన్నై: ప్రియుడి వ్యామోహంలో కన్నబిడ్డలను దారుణంగా హత్య చేసి, భర్తను చంపాలని ప్రయత్నించిన చెన్నైకి చెందిన కిరాతకురాలు అభిరామి కథ చాల పెద్దదని వెలుగు చూసింది. భర్త విజయన్ అలియస్ విజయ్ కళ్లుగప్పి ప్రియుడు సుందరంతో రాసలీలలు సాగించిన అభిరామి చాల మందితో టచ్ లో ఉందని వెలుగు చూసింది. అభిరామి కన్నుగీటు వీడియోలు మరికొన్ని బయటకు వచ్చాయి.
Recommended Video
నా భర్తకు చావు గిఫ్ట్: మిస్ అయ్యింది, పోలీస్ ఫోన్ తో ప్రియుడికి ఫోన్, ప్లాన్ రివర్స్!
కన్నుగీటుతూ మరో వ్యక్తితో అభిరామి మాట్లాడిన వీడియోలు శుక్రవారం బయటకు వచ్చాయి. మొబైల్ లో వీడియో కాల్స్ తో అభిరామితో మాట్లాడిన పలువురు ఇప్పుడు వారి వ్యవహారం ఎక్కడ బయటకు వస్తుందో అని హడలిపోతున్నారని సమాచారం.
ప్రియా వారియర్
మలయాళం నటి ప్రియా వారియర్ లాగా అభిరామి కన్నుగీటుతూ, హీరోయిన్ లా ఫీలైపోయి ప్రియుడు సుందరంతో గంటలు గంటలు వీడియో కాల్స్ తో మాట్లాడింది. మూడు రోజుల క్రితం అభిరామి, సుందరం మాట్లాడిన వీడియో కాల్స్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వీడియో దెబ్బకు షాక్
అభిరామి ప్రియుడు సుందరంతోనే కాకుండా వీడియోకాల్స్ తో అనేక మందితో మాట్లాడిందని వెలుగు చూసింది. అభిరామి, మరో యువకుడు పిచ్చపిచ్చగా మాట్లాడుకుంటున్న వీడియోలు శుక్రవారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దెబ్బతో అభిరామితో మాట్లాడిన యువకుడు తనను ఎక్కడ పోలీసులు విచారణకు పిలుస్తారో అని హడలిపోతున్నాడని సమాచారం.
జైల్లో ఆవేదన
అభిరామి, సుందరం చెన్నైలోని సెంట్రల్ జైలులో ఉన్నారు. కన్నబిడ్డలను హత్య చేసిన అభిరామి ఇప్పుడు విచారంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నదని జైలు సిబ్బంది అంటున్నారు. అభిరామి ప్రియుడు సుందరం మాత్రం ఎలాంటి విచారం వ్యక్తం చెయ్యడం లేదని తెలిసింది.
లవ్ స్టోరీ చెప్పాలి
చెన్నైలోని సెంట్రల్ జైలులో సాటి ఖైదీలతో పాటు అభిరామి ఓ సెల్ లో ఉంటున్నది. అయితే తనకు ప్రత్యేక సెల్ ఇవ్వాలని అభిరామి చెబుతున్నదని జైలు సిబ్బంది అంటున్నారు. తన లవ్ స్టోరీ చెప్పాలని సాటి ఖైదీలు వేధిస్తున్నారని, తాను వారితో కలిసి ఉండలేనని అభిరామి విలపిస్తున్నదని జైలు సిబ్బంది అంటున్నారు.
జీవితం నాశనం
బిడ్డలను కిరాతకంగా హత్య చెయ్యడం, భర్త విజయ్, తల్లిదండ్రులు దూరం కావడం, ప్రియుడు జైల్లో ఉండటంతో అభిరామి పరిస్థితి దారుణంగా తయారైయ్యింది. అందరూ దూరం కావడంతో తన జీవితం నాశనం అయ్యిందని అభిరామి సాటి ఖైదీలతో చెబుతోందని జైలు సిబ్బంది అంటున్నారు.
ఒక్కరూ రాలేదు
జైల్లో ఉన్న అభిరామిని చూడటానికి ఒక్కరూ వెళ్లలేదని తెలిసింది. అభిరామి ముఖం చూడటానికి వారి కుటుంబ సభ్యులు, బంధువులు జైలు సిబ్బంది అంటున్నారు. సుందరంను కలవడానికి అతని భార్య ఒక్కసారి సెంట్రల్ జైలు దగ్గరకు వెళ్లిందని తెలిసింది.