వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్ బీజేపీ ఎంఎల్ఏపై హత్యాయత్నం

|
Google Oneindia TeluguNews

జైపూర్: బీజేపీ శాసన సభ్యుడిపై హత్యాయత్నం జరిగిన సంఘటన రాజస్థాన్ లో జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డాడని రాజస్థాన్ పోలీసు అధికారులు తెలిపారు.

రాజస్థాన్ లోని దౌసా లోని మహ్వా శాసన సభ నియోజక వర్గానికి చెందిన శాసన సభ్యుడు ఓం ప్రకాష్ హుడ్లా ఇంట్లో పనుల్లో బిజిగా ఉన్నారు. ఆ సందర్బంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కిటికిలో నుండి ఆయన మీద కాల్పులు జరిపారు.

 Abortive attempt on the life of BJP MLA in Rajasthan

విషయం గుర్తించిన ఓం ప్రకాష్ హుడ్లా తప్పించుకున్నాడు. పలు రౌండ్ లు కాల్పులు జరిపారు. తుపాకి తూటాల నుండి తప్పించుకున్న ఓం ప్రకాష్ హుడ్లా వెంటనే ఇంటిలో అలారం మోగించారు. సెక్యూరిటి సిబ్బంది అలర్ట్ అయ్యారు.

చిక్కిపోతామని భయపడిన నిందితులు అక్కడి నుండి పరారైనారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్యాయత్నం జరిగిందా, రాజకీయ కక్షలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.

English summary
Three unidentified men broke into the government residence of BJP MLA from Dausa's Mahwa constituency Omprakash Hudla near state assembly building and attempted to fire at him from a window.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X