వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా కోరిక తీర్చండి: కసితీరా పొడిచి చంపిన సిస్టర్స్

|
Google Oneindia TeluguNews

మీరట్: లక్ష రూపాయలు రుణం ఇచ్చిన వడ్డీ వ్యాపారీ తన కోరిక తీర్చడానికి నీ కుమార్తెలను పంపించు అని వేధింపులకు గురిచెయ్యడంతో ముగ్గురు సోదరీమణులు కలిసి అతన్ని 20 సార్లు కత్తులతో పోడిచి దారుణంగా హత్య చేశారు.

ఉత్తరప్రదేశ్ లోని షామిలీ పట్టణంలో షమీమ్ అహమ్మద్ అనే వడ్డీ వ్యాపారీ నివాసం ఉంటున్నాడు. వడ్డీ వ్యాపారి ముగ్గురు యువతుల తండ్రి ఇంటి నిర్మాణానికి రూ. లక్ష రూపాయలు రుణం ఇచ్చాడు. తరువాత వారి దగ్గర నెలనెల వడ్డీ తీసుకుంటున్నాడు.

ఆయనకు 27 ఏళ్ల పెద్ద కుమార్తె ఉంది. ఆమె మీద వడ్డీ వ్యాపారి షమీమ్ అహమ్మద్ కన్నుపడింది. అంతే నీకు ఇచ్చిన రుణాన్ని మాఫీ చేస్తానని, నీ పెద్ద కుమార్తెతో నా కోరిక తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని తండ్రికి చెప్పాడు.

Abusive usuer stabed to death by three Uttar Pradesh sisters

తీసుకున్న రుణం ఎలాగైనా తిరిగి చెల్లించాలని ఆయన చాలప్రయత్నాలు చేశారు. అయితే వడ్డీ వ్యాపారీ షమీమ్ అహమ్మద్ ఆమె తండ్రి మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశాడు. విసిగిపోయిన తండ్రి కుమార్తెలకు విషయం చెప్పాడు.

ఆ ముగ్గురిలో ఓ యువతిని తన ఇంటికి రావాలని షమీమ్ అహమ్మద్ కు చెప్పింది. మంచి చాన్స్ వచ్చిందని షమీమ్ అహమ్మద్ వెనుకాముందు ఆలోచించకుండా వారి ఇంటికి వెళ్లాడు. అతన్ని ఇంటిలోకి పిలిచారు.

ఇంటిలోపలికి వెళ్లిన వెంటనే ఆముగ్గురు యువతులు తలుపు మూసేశారు. ముగ్గురు మూడు కత్తులు తీసుకుని 20 సార్లు షమీమ్ అహమ్మద్ మీద దాడి చేశారు. అంతే అతని ప్రాణాలు అక్కడే పోయాయి. ముగ్గురు సోదరీమణులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ముగ్గురు యువతులను అరెస్టు చేసి కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వడ్డీ వ్యాపారి హత్య కేసులో యువతుల తండ్రిని, ఓ యువతి స్నేహితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

English summary
One of the women asked Ahmad to come to a house he owns. Soon after he reached, he was attacked by the three women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X