ఏబీవీపీ v/s జేఎన్యూఎస్యూ: జేఎన్యూ వర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత, ముసుగెసుకొని దాడులు
Recommended Video
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వామపక్షాలు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. కానీ సబర్మతి, ఇతర హాస్టళ్లలోకి ఇతరులు ప్రవేశించి దాడి చేశారని జేఎన్యూఎస్యూ విద్యార్థి సంఘం పేర్కొన్నది. వారు ముసుగు ధరించి వచ్చి.. కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపింది.
దాడిలో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ విద్యార్థి సంఘం ప్రమేయం ఉందని.. సబర్మతి హాస్టల్ వద్ద ఉన్న ఆస్తికి నష్టం కలిగించినట్టు జేఎన్యూఎస్యూ ఆరోపించింది. ఏబీవీపీ చేసిన దాడిలో జేఎన్యూఎస్యూ అధ్యక్షుడు ఐషే ఘోష్, ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్ గాయపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఐషే ఘోష్ తల నుంచి రక్తస్రావం వస్తోంది.
Jawaharlal Nehru University Student Union (JNUSU) President Aishe Ghosh at JNU: I have been brutally attacked by goons wearing masks. I have been bleeding. I was brutally beaten up. pic.twitter.com/YX9E1zGTcC
— ANI (@ANI) January 5, 2020
ముసుగులు ధరించిన గుండాలు తనపై దాడి చేశారని ఘోష్ తెలిపారు. వారి దాడిలో తలపై తీవ్రమైన గాయాలయ్యాయని పేర్కొన్నారు. హాస్టల్లో దాడికి సంబంధించి హాస్టల్ ఫీజు పెంపు, సెమిస్టర్ పరీక్షల ముందు రిజిస్ట్రేషన్ బహిష్కరణ నేపథ్యంలో జరిగిందని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే పెరియార్ హాస్టల్ వద్ద వామపక్ష సంఘాల కార్యకర్తలు దాడిచేశారని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఘటనలో ఏబీవీపీకి చెందిన మనీశ్ తీవ్రంగా గాయపడ్డారు.