వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ భాషలోనే సమాధానం చెప్పాలి: ప్రవీణ్ తొగాడియా
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ ఉగ్ర దాడిని భారత్ దేశంపై పాకిస్తాన్ యుద్ధ ప్రేరేపిత చర్యగా విశ్వ హిందూ పరిషత్తు నాయకుడు ప్రవీణ్ తొగాడియా మంగళవారం నాడు అభివర్ణించారు. దీనికి దౌత్యపరంగా లేదా చర్చల ద్వారా ప్రత్యుత్తరమివ్వడం సాధ్యపడదని అభిప్రాయపడ్డారు.
ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. భారత్ విషయంలో పాకిస్తాన్ నిజాయితీగా వ్యవహరించడం లేదని, దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్, మసూద్లను ఇప్పటి వరకూ మనకు అప్పగించలేదన్నారు.
ఇలాంటి ముష్కరులను కట్టడి చేయాలని పాకిస్తాన్ అసలు అనుకోవడమే లేదన్నారు. ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలని ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. అతను పంజాబ్లోని పాన్వాడలో మాట్లాడారు.
Comments
English summary
VHP leader Pravin Togadia today termed the Pathankot terror strike as an “act of war” against India and said it cannot be answered diplomatically or through dialogue.
Story first published: Wednesday, January 20, 2016, 14:08 [IST]