జైల్లో సెక్సువల్ టార్చర్?: నడవ లేని స్థితికి: మరో ఉద్యమకారిణికి బెయిల్
చండీగఢ్: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు, నిరసనల వ్యవహారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వరుసగా రెండో రోజూ చుక్కెదురైంది. రైతులకు మద్దతుగా గళం విప్పిన దళిత యువతి, కుల వివక్ష వ్యతిరేక పోరాట ఉద్యమ కార్యకర్త నవ్దీప్ కౌర్కు బెయిల్ లభించింది. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే జస్టిస్ అవనీష్ ఝింగన్ ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది.
Nodeep Kaur and Disha Ravi, young female activists jailed for supporting the farmer protests in India, were granted bail. I want to believe it's in part because so many people spoke out against the government's silencing dissent. Please stay loud — this fight is far from over.
— Meena Harris (@meenaharris) February 26, 2021
ఇప్పటికే మూడుసార్లు ఆమె బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో.. తాజాగా హైకోర్టు ఎలాంటి తీర్పును వినిపిస్తుందనేది ఉత్కంఠతకు గురి చేసింది. ఆమెకు బెయిల్ లభించడంతో తోటి సామిజక, ఉద్యమ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు. రైతు ఉద్యమంతో ముడిపడి ఉన్న టూల్కిట్ వ్యవహారంలో అరెస్టయిన బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దిశ రవికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న పర్యావరణ కార్యకర్త శంతను ములుక్కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఇదే క్రమంలో తాజాగా నవ్దీప్ కౌర్కు బెయిల్ మంజూరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం ఆమె కర్నాల్ జైలులో ఉన్నారు. నవ్దీప్ కౌర్.. పంజాబ్కు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి. నాలుగు నెలల కిందటే ఆమె ఢిల్లీలోని ఓ ఫ్యాక్టరీలో చేరారు. ఢిల్లీ సరిహద్దులలో ఉద్యమిస్తున్న సొంత రాష్ట్రానికి చెందిన రైతులకు మద్దతు పలికారు. వ్యవసాయ చట్టాలపై నిరసన ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కిందటి నెల అరెస్ట్ అయ్యారు.
Media friends in Delhi, please see if you can attend this:
— Sushmita (@Sushmitav1) January 23, 2021
On Jan 12, Haryana Police barged into the Majdoor Adhikar Sanghatan tent erected in solidarity with the protesting farmers at the Singhu Border and arrested a 24-year-old dalit woman, a trade union activist Nodeep Kaur. pic.twitter.com/36aeabJqca
జైల్లో ఆమె చిత్రవధను ఎదుర్కొన్నారనే ప్రచారం ఉంది. అరెస్టయిన మరుసటి రోజే ఆమె నడవలేని స్థితికి చేరుకున్నారని, దీనికి కారణం పోలీసులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటమేననే వార్తలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ సమీప బంధువు మీనా హ్యారిస్ సైతం ట్వీట్ చేశారు. తాజాగా- నవ్దీప్ కౌర్కు బెయిల్ లభించడం పట్ల మీనా హ్యారిస్ హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్లను ఆమె రీట్వీట్ చేశారు. రైతు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఇద్దరు యువతులు నవ్దీప్ కౌర్, దిశరవి చట్టపరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారికి బెయిల్ లభించడం సంతోషాన్నిస్తోందంటూ తాజాగా ట్వీట్ చేశారు.