వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: టీవీ లైవ్ షోలో మాట్లాడుతూ కన్నుమూసిన సామాజిక కార్యకర్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: టీవీ ఛానల్ లైవ్ షోలో ప్రముఖ మహిళా స్కాలర్ గుండె నొప్పి కారణంగా మృతి చెందారు. ఈ విషాధ సంఘటన జమమ్ము కాశ్మీర్‌లో సోమవారం జరిగింది. డోగ్రీ స్కాలర్ కమ్ సామాజిక ఉద్యమకారిణి పేరు రీటా జితేందర్. ఆమె లైవ్ షోలో మాట్లాడుతూనే కన్నుమూశారు.

దూరదర్శన్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్న ఓ టాక్‌ షో ప్రత్యక్ష ప్రసారంలో యాంకర్‌ అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతున్నారు. ఆ సమయంలో మధ్యలో గుండెపోటు వచ్చింది. నిర్వాహకులు స్పందించి రీటాకు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు మృతి చెందారు.

Activist Rita Jetinder collapses on live TV during talk show in J&K, dies

ఆమె ఆఖరి క్షణాల్లో కుర్చీలో వెనక్కు వాలిపోయిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో చూసిన వారంతా షాకవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటున్నారు. రీటా జితేందర్‌ గతంలో జమ్ము కాశ్మీర్‌ భాషా, సాంస్కృతిక అకాడమీకి కార్యదర్శిగా పనిచేశారు.

ఈ ఏడాది జనవరిలో కేరళకు చెందిన ఆర్టిస్ట్ కాళమండలం గీతానందన్ త్రిసూర్ జిల్లాలో గుడిలో ప్రదర్శన చేస్తూ కన్నుమూశారు. గీతానందన్ వయస్సు 58.

English summary
A prominent scholar in Jammu and Kashmir died in the middle of a TV show on Monday. Rita Jetinder, a social activist and a Dogri scholar, was on a show on state-run Doordarshan in Srinagar when she collapsed live on TV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X